శివసేన చీఫ్ నే లేపేద్దామనుకున్నాడట

Update: 2016-02-14 04:02 GMT
ముంబయి దాడులకు బాధ్యుడు.. అంతర్జాతీయ టెర్రరిస్ట్.. పాకిస్థానీ అమెరికన్ అయిన డేవిడ్ రిచర్డ్ హెడ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయవిచారణలో పాల్గొని వాంగ్మూలం ఇవ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

శివసేన అధినేతను హతమార్చాలని.. శివసేన కార్యాలయంపై దాడి చేయాలని తాను అనుకున్నట్లు చెప్పాడు. అందులో భాగంగా శివసేనకు చెందిన రాజారామ్ రెగె అనే కార్యకర్తను కలిశానని.. అతడితో స్నేహం పెంచుకునే ప్రయత్నం చేసినట్లుగా వెల్లడించాడు. ముంబయి దాడుల సందర్భంగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఎందుకు దాడులు చేయలేకపోయారంటూ లష్కరే తాయిబా అడిగిందని.. సిద్ధి వినాయక టెంపుల్ మీదా.. నావల్ ఎయిర్ స్టేషన్ మీదా దాడులు చేయొద్దని తానే చెప్పినట్లుగా వెల్లడించారు.

ఆ రెండు ప్రాంతాల్లో దాడులు చేయాలంటే పది మంది ఉగ్రవాదులు అవసరమవుతారని.. అదే సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో జనాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో దాడులు చేయొద్దని చెప్పినట్లుగా పేర్కొన్నాడు. రానున్న రోజుల్లో మరెన్ని సంచలన విషయాలు బయటపెడతాడో..?
Tags:    

Similar News