టీమ్ లో విభేదాలా? హాట్ టాపిక్ గా మారిన సూర్య-హార్దిక్ కోల్డ్ వార్ !
భారత క్రికెట్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టీమిండియా స్టార్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
భారత క్రికెట్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టీమిండియా స్టార్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఒకరినొకరు చూస్తేనే పడదనే రేంజ్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అసలు రోహిత్ శర్మ తర్వాత మొదలైన కెప్టెన్సీ పోరు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందా? ఇదంతా కేవలం ప్రచారమేనా లేక ఇందులో ఏదైనా నిజం ఉందా? ఈ విషయాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం.
కెప్టెన్సీ పోరుతో మొదలైన లొల్లి:
నిజానికి, 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కథ మొత్తం మారింది. వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యానే తదుపరి కెప్టెన్ అవుతాడని అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే, సెలక్టర్లు ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. ఇక ప్రముఖ వార్తా సంస్థ 'పీటీఐ' కథనం ప్రకారం.. సూర్యకు కెప్టెన్సీ దక్కడం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు జట్టులోని ఒక సీనియర్ ప్లేయర్ కీలక పాత్ర పోషించారట. ఇక అప్పటి నుంచే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైందని ప్రచారం జరుగుతోంది.
డ్రెస్సింగ్ రూమ్లో గందరగోళం?:
ఆ కెప్టెన్సీ మార్పు జరిగినప్పటి నుండి డ్రెస్సింగ్ రూమ్లో సూర్య, హార్దిక్ మధ్య సత్సంబంధాలు లేవని, ఇద్దరూ ముభావంగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది. అంతర్జాతీయ మ్యాచ్లలోనే కాదు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీమ్లో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయిందని ఇన్సైడ్ టాక్. మైదానంలో కూడా చిన్న చిన్న విషయాలకు, అంటే వికెట్ పడినప్పుడు సరిగ్గా సెలబ్రేట్ చేసుకోకపోవడం, క్యాచెస్ మిస్ అయినప్పుడు ఒకరినొకరు చూసుకునే విధానం వంటివి ఈ విభేదాల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.
నో క్లారిటీ.. అంతా సీక్రెట్:
క్రికెట్ వర్గాల్లో ఈ రేంజ్లో వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై ఎక్కడా ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. బీసీసీఐ కానీ, జట్టు మేనేజ్మెంట్ కానీ డ్రెస్సింగ్ రూమ్లో సఖ్యత లేదనే ప్రచారాన్ని ఎక్కడా ఒప్పుకోలేదు. ఇరు ఆటగాళ్ల అభిమానులు సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోయి తిట్టుకుంటున్నారే తప్ప, నేరుగా ఏ ఒక్కరూ దీనిపై నోరు విప్పలేదు.
గాసిప్స్కు చెక్ పెట్టిన సూర్యభాయ్:
తాజాగా ఈ వివాదాలపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా స్పందించారు. వైస్ కెప్టెన్సీ లేదా ఇతర నాయకత్వ బాధ్యతల విషయంలో తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. "తామిద్దరం మైదానంలో ఎంత కష్టపడతామో, బయట కూడా అంతే మంచి స్నేహితులం" అని సూర్య చెప్పుకొచ్చారు. టీమిండియా విజయమే తమ ఇద్దరి మొదటి లక్ష్యమని, ఇలాంటి రూమర్లను నమ్మవద్దని ఫ్యాన్స్కు క్లారిటీ ఇచ్చారు.
భారత క్రికెట్లో కెప్టెన్సీ మారినప్పుడు ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. గతంలో సచిన్-అజహరుద్దీన్, ధోని-సేహ్వాగ్, విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మల మధ్య కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. అయితే, మైదానంలో ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడి దేశానికి కప్పులు అందిస్తున్నంత కాలం ఇలాంటి గాసిప్స్ పెద్దగా మ్యాటర్ కావు. మరి సూర్య, హార్దిక్ రాబోయే రోజుల్లో కలిసి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో వేచి చూడాల్సిందే.