ఏపీలో కరోనా పంజా..మళ్లీ రికార్డ్ కేసులు!!

Update: 2020-08-08 13:31 GMT
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి.

 రోజుకు 10వేల కేసులకు తగ్గకుండా ఏపీలో నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో చూస్తే.. తాజా 10వేలకు పైగా కేసులు మరోసారి నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 24 గంటల్లో 10080 కేసులు నమోదయ్యాయి.  తాజాగా 62123 టెస్టులు చేశారు. ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఏపీలో 97మంది మృతి చెందడం విషాదం నింపింది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,17,040కు చేరాయి. మొత్తం ఏపీలో మరణాల సంఖ్య  1939కి చేరింది.

కరోనా నుంచి  మొత్తం కోలుకున్న వారి సంఖ్య 129615గా ఉంది. 85486 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా గుంటూరు లో 14మంది ప్రాణాలు కోల్పోయారు.

అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1353 కేసులు.. తూర్పుగోదావరి జిల్లాలో 1310, క  కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News