రోటీన్ కు భిన్నంగా కేశినేని నాని పోస్ట్

Update: 2019-08-23 17:30 GMT
నిత్యం వాళ్ల మీదా.. వీళ్ల మీదా.. కొన్ని సందర్భాల్లో సొంతోళ్ల మీద సైతం రాజకీయ పోస్టులు పెట్టి తరచూ వార్తల్లోకి ఎక్కటం విజయవాడ ఎంపీ కేశినేని నానికి అలవాటుగా మారింది. తొలిసారి ఎంపీగా ఉన్నప్పుడు లేని సోషల్ మీడియా చురుకుదనం తాజాగా మాత్రం ఆయనకు పెరిగిందనే చెప్పాలి. సంచలన వ్యాఖ్యల్ని తరచూ చేయటం ద్వారా పోస్టులతో అందరి చూపుల్ని తన మీద పడేలా చేసుకోవటంలో కేశినేని నాని సక్సెస్ అయ్యారే చెప్పాలి.

అలాంటి ఆయన తాజాగా మాత్రం.. రోటీన్  కు భిన్నమైన పోస్ట్ ను పెట్టారు. ట్రావెల్స్ యజమానిగా సుపరిచితుడు.. కార్పొరేట్ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలతో పాటు.. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చక్కటి అనుబంధం ఉందని చెప్పుకునే కేశినేని నాని.. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త.. టాటా గ్రూపునకు మాజీ ఛైర్మన్ అయిన రతన్ టాటాను కలిసిన ఫోటోను పోస్ట్ చేశారు.

తనకు మార్గదర్శి అయిన రతన్ టాటాను ముంబయికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా పేర్కొన్నారు. 81 ఏళ్ల రతన్ టాటాలో వయోభారం తాజా ఫోటోలో కొట్టొచ్చినట్లుగా కనించటం గమనార్హం. అదే సమయంలో.. తనకున్న స్థాయి.. పారిశ్రామిక ప్రపంచంలో తనకున్న సంబంధాల్ని కేశినేని నాని తాజా ఫోటోతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News