బోన‌మెత్తిన వెంక‌య్య‌..ఢిల్లీలో సంద‌డి

Update: 2017-06-27 09:48 GMT
తెలంగాణ ప్ర‌జ‌లు అట్టహాసంగా జ‌రుపుకొనే బోనాల పండుగలో బీజేపీ అగ్ర‌నేత‌ - కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సంద‌డి చేశారు. ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన‌డ‌మే కాకుండా నెత్తిన బోనం ఎత్తి అతిథుల‌కు సంతోసాన్ని పంచారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ లో మహంకాళి బోనాల వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. మంగళవారం బోనాల వేడుకలో పాల్గొన్న  వెంకయ్యనాయుడు.. మహంకాళి అమ్మవారికి కేంద్రం తరపున పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం బోనమెత్తి మొక్కులు తీర్చుకున్నారు.

బోనాల పండుగ‌లో పాల్గొని బోనం ఎత్తిన సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. భావితరాలకు సంప్రదాయ పండుగలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి - అధికారులకు - ఆలయ కమిటీ నిర్వాహకులకు వెంకయ్య అభినందనలు తెలిపారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పండుగ‌లు ఆత్మీయ అనురాగాల‌కు ప్ర‌తీక‌లుగా నిలుస్తున్నాయ‌ని ప్ర‌శంసించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News