వాజ్ పేయికి నివాళి.. అగ్నివేష్ పై దాడి

Update: 2018-08-17 11:55 GMT

గిరిజనులు, ఇతర వర్గాలను మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలపై సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ పై అప్పట్లో బీజేపీ కార్యకర్తలు, హిందుత్వ వాదులు దాడి చేసి గాయపరిచారు. తాజాగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలకు స్వామి హాజరయ్యారు. వాజ్ పేయి పార్టీవ దేహానికి నివాళులర్పించేందుకు రాగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన్ను తరిమి తరిమి కొట్టారు.

కొందరు యువకులు  స్వామి అగ్నివేష్ పై దాడి చేశారు. స్వామి వెంటే ముగ్గురే ఉండడంతో ఆ గుంపును అపడం వారి వల్లకాలేదు.  అగ్నివేష్ తలపాగా లాగేసి కిందపడేసి.. తిడుతూ.. దాడి చేశారు. తనను కొందరు దేశద్రోహి అంటూ కొట్టండి కొట్టండి అని పిడిగుద్దులు గుద్దారని స్వామి అగ్నివేష్ వాపోయాడు.

అగ్నివేష్ పై ఇలా బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం ఇది రెండోసారి.. ఇదివరకూ జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఆర్ఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హిందుత్వ వాది ముసుగులో హిందువులను మత మార్పిడి చేయిస్తున్నాడని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అగ్నివేష్ ను  కొడుతున్న ఈ తాజా వీడియోను కొందరు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది.
Tags:    

Similar News