కరోనా అంత్యక్రియలకు రూ.15వేలు సాయం .. సీఎం జగన్ కీలక నిర్ణయం !

Update: 2020-08-04 14:00 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మృతుల కుటుంబాలకు సాయం చేయాలని  సీఎంజగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15వేలు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కొద్దిసేపటి జీవో జారీ చేశారు. దీనితో ఇకపై కరోనాతో ప్రాణాలు విడిచివ‌ర‌ వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల కోసం‌ రూ.15వేలు అందించ‌నున్నారు.

 జీవో జారీ చేసిన‌ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు రూ.12 కోట్లు విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌‌ ను ఆదేశించారు. వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ,  ప్లాస్మాను దానం చేసిన వారికి ఐదు వేలు అందివ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్లాస్మా థెరపీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని.. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సూచించారు. ప్లాస్మా దానం చేసే వారికి రూ. 5,000 ప్రోత్సాహకంగా ఇవ్వడం వ‌ల్ల‌..వారు మంచి భోజనం తీసుకునేందుకు ఉపయోగపడుతుందని,దానికి  సంబంధించి కూడా జీవో విడుద‌ల అయ్యింది.
Tags:    

Similar News