ఆ కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ వచ్చిందా?

Update: 2020-07-22 13:00 GMT
కరోనా మహమ్మారి విస్తృతి దేశంలో పెరిగిపోతోంది. శరవేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలో కాస్త తగ్గినా.. ఏపీలో మాత్రం రోజుకు 5వేల కంటే ఎక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. ఇక ఏపీలో ఈరోజు 6వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

కాగా తెలుగురాష్ట్రాలకు కీలకమైన నేత.. ఓ కేంద్రమంత్రికి కూడా కరోనా సోకినట్టు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న సదురు కేంద్రమంత్రి ఏపీ, తెలంగాణ వ్యవహారాలు కూడా చక్కబెడుతుంటారు. అలాంటి ఆయనకు కరోనా సోకిందనే వార్త కలకలం రేపుతోంది. ఇది బీజేపీ శ్రేణుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది.

అయితే సదురు కేంద్రమంత్రి కానీ.. భారత ప్రభుత్వం కానీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. మీడియాలో వస్తున్న వార్తలపై సదురు కేంద్రమంత్రి ఇప్పటివరకు స్పందించలేదు. ఇది నిజమా? అబద్దమా అన్నది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News