'తెనాలి' షాక్: తల్లితో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి మర్మాంగాన్ని కోసిన కుమార్తె

Update: 2022-05-03 04:29 GMT
గుంటూరు జిల్లా తెనాలిలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. తన తల్లితో వివాహేతర సంబంధం ఉందన్న కోపంతో.. సదరు వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది కుమార్తె. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలికి వచ్చాడు.

కూలి పని చేసుకునే అతనికి స్థానిక ఐతా నగర్ కు చెందిన ఒక వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

తాజాగా సదరు మహిళతో మద్యం సేవించి.. ఆమె ఉండే ఇంటి పైన ఉన్న భవనంలో నిద్రపోయాడు. తన తల్లితో వివాహేతర సంబంధం ఉన్న రామచంద్రారెడ్డి తీరుపై ఆగ్రహంతో ఉడికిపోతోంది సదరుమహిళ కుమార్తె.

ప్రియుడితో కలిసి తల్లి నిద్ర పోతున్న వేళ.. సదరు కుమార్తె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అక్కడకు వచ్చింది.

రామచంద్రారెడ్డితో గొడవ పడింది. తన ప్రియుడి సాయంతో తన తల్లితో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్న వ్యక్తి మర్మాంగాన్ని బ్లేడ్ తో కోసేసింది. దీంతో.. పెద్ద ఎత్తున కేకలు వేశాడు. దీంతో స్థానికులు కలిసి రామచంద్రారెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tags:    

Similar News