రోడ్డు ప్రమాదంలో భగత్ సింగ్ మనమడు మృతి

Update: 2016-05-29 13:52 GMT
దేశ వ్యాప్తంగా రోడ్లు రక్తమోడుతున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలతో ఏటా లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్న పరిస్థితి. రోడ్డు ప్రమాదాల కారణంగా పెద్ద ఎత్తున కటుంబాలు రోడ్డున పడుతున్న దుస్థితి. రోడ్డు ప్రమాదాలకు సామాన్యులే కాదు.. ప్రముఖులు కూడా బాధితులుగా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ మనమడు  తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యుపాలయ్యారు.

హిమాచల్ ప్రదేశ్ లోని రాంపూర్ బుషాహర్ జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. బైక్ మీద ప్రయాణిస్తున్న 27 ఏళ్ల అభితేజ్ తన ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లుగా చెబుతున్నారు. బైక్ స్కిడ్ కావటంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారని చెబుతున్నారు. అభితేజ్ ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తించిన ఆయన స్నేహితులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర గాయాలపాలైన అభితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించిన అభితేజ్.. భగత్ సింగ్ తోబట్టు మనమడు.
Tags:    

Similar News