ఘోర రోడ్డు ప్రమాదం.. 20మంది మృతి

Update: 2018-12-15 10:46 GMT
ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది.  రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నేపాల్ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు కొండపై నుంచి అదుపు తప్పి 100 మీటర్ల లోయలో పడిపోయింది.   ఈ ఘటనలో 20మంది వరకు మరణించారు. 17మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఖట్మండు సమీపంలోని నువాకోట్ జిల్లాలో శనివారం ఈ ప్రమాదం సంభవించింది. గయాంగడండా ప్రాంతంలో జరిగిన ఈ   ప్రమాదంలో గాయపడ్డ 17మందిని  సెంట్రల్ నేపాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మృత దేహాలను వెలికితీసినట్టు పోలీస్ అధికారి గయాన్ లాల్ తెలిపారు. ట్రక్కులో ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించు కోవడంతోనే వాహనం అదుపుతప్పినట్టు అధికారులు తెలిపారు.
    

Tags:    

Similar News