బెల్లంకొండ మళ్లీ అదే ఫార్ములా.. అసలు తగ్గేదేలే

ఆ సినిమా కోసం చాలా కష్ట పడటం తో పాటు ఎక్కువ సమయం కేటాయించాడు.

Update: 2024-05-02 15:30 GMT

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రాజమౌళి చత్రపతిని హిందీలో రీమేక్ చేసిన బెల్లంకొండ బాబుకు నిరాశే మిగిలింది. ఆ సినిమా కోసం చాలా కష్ట పడటం తో పాటు ఎక్కువ సమయం కేటాయించాడు. అయినా ఫలితం దక్కలేదు.

గత ఏడాది చత్రపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ కాస్త బ్రేక్ తీసుకుని కొత్త సినిమాకు రెడీ అయ్యాడు. మూన్‌ షైన్‌ పిక్చర్స్ బ్యానర్‌ లో భారీ బడ్జెట్‌ తో రూపొందబోతున్న సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించబోతున్నాడు.

లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ను హీరోయిన్‌ గా ఎంపిక చేయడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. భారీ సైన్స్ ఫిక్షన్‌, సోషియో ఫాంటసీ సినిమాగా ఈ సినిమాను లుధీర్‌ బైరెడ్డి రూపొందించబోతున్నాడు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు నిర్మాణ సంస్థ ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్‌ ఆరంభం నుంచి కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ బడ్జెట్‌ సినిమాలు చేయడంతో పాటు, పెద్ద హీరోయిన్స్ తో నటిస్తూ వచ్చాడు.

Read more!

మొదటి సినిమాలోనే సమంతతో రొమాన్స్ చేసిన ఘనత ఈయనకు దక్కింది. ఇప్పుడు మరోసారి ఏకంగా రూ.50 కోట్ల బడ్జెట్‌ సినిమాను చేస్తున్నాడు. పైగా క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్‌ ను ఈ సినిమాలో నటింపజేయడం తో బెల్లంకొండ బాబు సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతోంది.

వరుసగా సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నా కూడా బెల్లంకొండ శ్రీనివాస్ బడ్జెట్‌ విషయంలో హీరోయిన్‌ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటూ పుష్ప 2 డైలాగ్‌ ను గుర్తు చేస్తున్నాడు. ముందు ముందు ఈ సినిమా గురించి మరెన్ని విశేషాలు, వార్తలు వినాల్సి వస్తుందో చూడాలి.

Tags:    

Similar News