సాహో...శ్రద్ధకు అంత ప్రాముఖ్యత ఉంటుందట

Update: 2019-06-25 16:56 GMT
టాలీవుడ్ సినిమాలు కానివ్వండి.. బాలీవుడ్ సినిమాలు కానివ్వండి.. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ప్రాధాన్యత తక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే..  మెజారిటీ సినిమాల్లో హీరోయిన్ల పాత్ర రెండు రొమాంటిక్ సీన్లకు.. నాలుగు పాటలకు  పరిమితం. ఇక యాక్షన్ జోనర్ లో తెరకెక్కిన చిత్రాల్లో హీరోయిన్ పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' అలా ఉండదట.  'సాహో' లో శ్రద్ధా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని.. అసలు 'సాహో' కథ హీరోయిన్ పాత్ర పైనే డ్రైవ్ అవుతుందని దర్శకుడు సుజిత్ అంటున్నాడు.

టీజర్ కట్ చేసే సమయంలో సుజిత్ ముందు రెండు ఆప్షన్లు అనుకున్నారట.. ప్రభాస్ సీన్ తో టీజర్ ను ప్రారంభించడం ఒకటైతే.. శ్రద్ధా సీన్ తో ప్రారంభించడం మరొకటి.  కానీ ఫైనల్ గా టీజర్ ను శ్రద్ధాతో ప్రారంభించేందుకే నిర్ణయం తీసుకున్నారట. దీని వెనక ఉద్దేశం ఏంటంటే ప్రభాస్ పెద్ద స్టార్ అయినా.. అందరి దృష్టి ప్రభాస్ పై ఉంటుందని తెలిసినప్పటికీ హీరోయిన్ కు ప్రాముఖ్యత ఉంటుందనే మెసేజ్ ప్రేక్షకులకు ఇవ్వడమేనట.  ఈ సినిమాలో శ్రద్ధా యాక్షన్ సీక్వెన్సులలో డూప్ లేకుండా నటించిందని సమాచారం. 

పైకి అంతా ప్రభాస్ కనిపిస్తున్నా....యాక్షన్ తప్ప పెద్దగా కథ ఉండదనే అభిప్రాయం అక్కడక్కడా వ్యక్తం అవుతున్నా దానికి పూర్తి భిన్నంగా కథకు.. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యతనివ్వడం నిజంగా మెచ్చుకోదగిన అంశమే.  ఒకవేళ నిజంగా ఇలానే ఉంటే 'సాహో' కు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కడం ఖాయమే. 
Tags:    

Similar News