ఎన్టీఆర్ అందుకే హోల్డ్ లో పెట్టాడా?

Update: 2016-10-22 04:13 GMT
పూరీ జగన్నాధ్-కళ్యాణ్ రామ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఇజం థియేటర్లలోకి వచ్చేసింది. నందమూరి అభిమానులు చాలానే అంచనాలు పెట్టుకున్నా.. వాటిని రీచ్ కాలేకపోయిందనే విషయం అర్ధమవుతోంది. సినిమా రివ్యూలు కానీ.. పబ్లిక్ పల్స్ కానీ.. మౌత్ టాక్ కానీ.. అన్నీ మిక్సెడ్ గానే ఉంటున్నాయి. మస్ట్ వాచ్ మూవీ అని ఒకళ్లు కూడా చెప్పడం లేదు సరికదా.. ఓకే అనేవాళ్లు కూడా పెద్దగా కనిపించడం లేదు.

దర్శకుడు పూరీ జగన్నాధ్.. ప్రొడ్యూసర్ కం హీరో కళ్యాణ్ రామ్ లు కాకుండా.. ఇజం విషయంలో అన్ని సంగతులు ముందు నుంచి తెలిసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. ఇజం రిలీజ్ తర్వాత ఎన్టీఆర్-పూరీల కాంబినేషన్ లో మూవీ అంటూ ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. అఫ్ కోర్స్.. ఇచ్చిన లీకులు అలాంటి వార్తలను పుట్టించాయి లెండి అది వేరే విషయం. అయితే.. ఈ విషయంలో ఎన్టీఆర్ నుంచి కానీ.. తన సన్నిహితుల నుంచి కానీ క్లారిటీ లేదు. కనీసం నిర్మాతగా వ్యవహరించే కళ్యాణ్ రామ్ కూడా.. ఆ ప్రాజెక్టుపై గట్టిగా మాట్లాడలేదు.

ఇందుకు కారణం ఇజం చూసిన జనాలకు ఈజీగానే అర్ధమైపోతుంది. కొత్త కథలతో ప్రయోగాలు అంటూ కబుర్లు చెప్పడమే తప్ప.. అదే పూరీ.. అదే కర్రీ అన్నట్లుగానే ఉంది వ్యవహారం. ఓ నెలన్నర క్రితమే రెడీ అయిపోయిన ఫైనల్ కాపీని చూసిన ఎన్టీఆర్.. పూరీతో సినిమా విషయంలో ఆలోచనలో పడ్డంలో ఏ మాత్రం తప్పు లేదులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News