అంతకు మించి.. అంటున్న రమ్యకృష్ణ!

Update: 2020-06-06 09:10 GMT
సౌత్ లో భారీ గుర్తింపు ఉన్న సీనియర్ నటి రమ్యకృష్ణ పోయినేడాది 'క్వీన్' వెబ్ సీరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.  గౌతమ్ మీనన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ కు గౌతమ్ మేనన్ తో పాటు ప్రసత్ మురుగేసన్ దర్శకత్వం వహించారు.  ఈ వెబ్ సీరీస్ తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి 'అమ్మ' జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిందని మొదట్లో ప్రచారం జరిగింది కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఈ సినిమా జయలలిత కథ కాదంటున్నారు. ఎంత కాదని చెప్పినప్పటికీ అది జయలిత జీవితమేనని చూసిన వారు అంటున్నారు.

త్వరలో ఈ వెబ్ సీరీస్ సెకండ్ సీజన్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ ఈ వెబ్ సీరీస్ అనిత శివకుమారన్ రాసిన 'క్వీన్' అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోంది.  శక్తి శేషాద్రి అనే ఓ బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ కథ అని రమ్య వెల్లడించారు.  ఆమె తన జీవితంలో ఎదురైన అడ్డంకులను ఎలా అధిగమించి విజయం సాధించారు అనేది ఈ కథలో ఉంటుందని చెప్పారు.

మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ థ్రిల్లింగ్ గా.. మరింత ఆసక్తికరంగా ఉంటుందని రమ్య చెప్పారు. ఈ సీజన్ లో శక్తి శేషాద్రి పాత్ర రాజకీయ నాయకురాలిగా ఎదిగే పయనం ఉంటుందన్నారు. 'క్వీన్' మొదటి సీజన్ ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అయింది.  ఓటీటీ లోనే కాకుండా జూన్ 6 నుంచి జీ టీవీ లో కూడా ప్రసారం కానుంది.
Tags:    

Similar News