మహేష్‌ తో పూరి ''జన గణ మన''

Update: 2016-04-28 16:33 GMT
అప్పట్లో దిల్ రాజు ''జన గణ మన'' అనే టైటిల్‌ రిజిష్టర్‌ చేయిస్తే.. అది పవన్‌ కళ్యాణ్‌ కోసం అనుకున్నాయం. అయితే ఇప్పుడు ఆ టైటిల్‌ తోనే అతి పెద్ద ట్విస్టిచ్చాడు దర్శకుడు పూరి జగన్‌.

పోకిరి సినిమా వచ్చి నేటికి పదేళ్ళు అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను సూపర్ స్టార్‌ మహేష్‌ తో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు పూరి జగన్‌. ఈ సినిమా పేరు ''జన గణ మన''. మరి సినిమాను నిర్మించేది దిల్‌ రాజు గారా.. లేకపోతే ఇంకెవరైనా అనే విషయం మాత్రం తెలియదు. అయితే.. ఈ సినిమాలో మాత్రం.. పోకిరి కంటే కిరాక్‌ గా.. అలాగే బిజినెస్ మ్యాన్‌ సినిమాలోకంటే పవర్ ఫుల్‌ గా ఉంటాడట మహేష్‌ బాబు. ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ పక్కా అంటూ ముందే చెబుతున్నాడు పూరి.

ఈ ప్రాజెక్టుపై మహేష్‌ కూడా అంతే ఫాస్టుగా స్పందించాడు. ''మరో అద్భుతమైన మెమరబుల్‌ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను సార్‌'' అంటూ చెప్పుకొచ్చాడు మహేష్‌. ఇంకేముంది.. జన గణ మన.. మహేష్‌ జెండా పాతేసినట్లే!!
Tags:    

Similar News