వైరస్ సోకినా బోనాల ఉత్సవాల్లో.. నిబంధనలు ఉల్లంఘించిన డిప్యూటీ స్పీకర్

Update: 2020-07-15 01:30 GMT
ముందే వైరస్ బాధితుడు.. ఆపై ప్రజాప్రతినిధి.. ఈ సమయంలో వైరస్ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంది. అయితే ఇవేవి పట్టింపు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయనే తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. బహిరంగ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అనుమతించకపోయినా ప్రజలు ఇళ్లల్లో చేసుకున్నారు. ఈ సమయంలో వైరస్ బారిన పడిన ఉప సభాపతి పద్మారావు గౌడ్ తన నివాసం ముందుకు వచ్చిన ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు.

ఇటీవల వైరస్ బారిన పడి చికిత్స పొందిన పద్మారావు గత వారం ఇంటికి చేరుకున్నారు. కానీ ఉత్సవాలు సందర్భంగా మాస్క్ లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా బోనాల ఉత్సవాల్లో పద్మారావు పాల్గొన్నారు. అతడి తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మారావు నిబంధనలు పాటించడం లేదు. గతంలో మంత్రి కేటీఆర్ పర్యటనలో ఇదే తీరిన ప్రవర్తించాడు. స్వయంగా కేటీఆర్ మాస్క్ ఇచ్చినా పెట్టుకోకుండా పద్మారావు జేబులో పెట్టుకుని నోటికి కట్టుకోలేదు. ఈ విషయాన్ని ఇటీవల కేటీఆర్ ఓ సమావేశంలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News