షాక్ ... కోవాగ్జిన్​ తీసుకున్న వలంటీర్​ మృతి..!

Update: 2021-01-09 14:17 GMT
భారత్​లో త్వరలోనే వ్యాక్సిన్​ పంపిణీ ప్రారంభిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. సీరం ఇన్​స్టిట్యూట్​ రూపొందించిన ఆస్ట్రాజెనికా.. భారత్​ బయోటెక్​ తయారుచేసిన కోవాగ్జిన్​ అత్యవసర పంపిణీని భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కోవాక్జిన్​ మూడో దశ ట్రయల్స్​ పూర్తికాకుండానే అనుమతి ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ప్రభుత్వం వ్యాక్సిన్​ పంపిణీ చేపట్టునుందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ వార్త ప్రజలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది. ఇటీవల ఈ వ్యాక్సిన్​ తీసుకున్న ఓ వలంటీర్​ మృతిచెందాడు. అయితే అతడు వ్యాక్సిన్​ తీసుకోవడం వల్లే మృతిచెందాడా? లేక ఏదైనా ఇతర సమస్యల వల్ల మృతిచెందాడా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

హైదరాబాద్​కు చెందిన భారత్​ బయోటెక్​ అనే సంస్థ కోవాగ్జిన్​ను తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​లో భాగంగా., భోపాల్‌కు చెందిన దీపక్ మరవి (42)కి వ్యాక్సిన్​ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్‌ 12న పీపుల్స్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌లో అతడికి కోవాక్జిన్​ డోస్​ ఇచ్చారు. అయితే సరిగ్గా పదిరోజుల తర్వాత దీపక్​ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషయంపై మెడికల్​ కళాశాల వైస్​ చాన్స్​లర్​ ఏమన్నారంటే.. ‘దీపక్​కు మేము కోవాగ్జిన్​ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అతడు విషప్రయోగం వల్ల చనిపోయాడని భావిస్తున్నాం. ఈ విషయంలో మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉందని చెబుతున్నారు.

అయితే డిసెంబర్​ 12న అతడు వ్యాక్సిన్​ తీసుకోగా డిసెంబర్​ 21న ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రస్తుతం కోవాగ్జిన్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంపై ఇంతవరకు భారత్​ బయోటెక్​ యాజమాన్యం స్పందించలేదు. కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ‘డిసెంబర్​ 12న దీపక్​ కోవాగ్జిన్​ తీసుకున్నాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి అతడు అనారోగ్యంతోనే ఉన్నాడు. అయితే డిసెంబర్​ 17న అతడు కొంత అస్వస్థతకు గురయ్యాడు. మేము ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పాం. కానీ అతడు వినలేదు. చివరకు డిసెంబర్​ 21న అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి నోట్లోనుంచి నురుగు వచ్చింది. ఎలా చనిపోయాడో అర్థం కావడం లేదు’ అని కుటుంబసభ్యులు అంటున్నారు.
Tags:    

Similar News