శంకర్రావ్ మాటలు వింటే మైండ్ పోవాల్సిందే

Update: 2015-11-25 09:50 GMT
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వ్యవహరించిన మాజీ మంత్రి శంకర్రావు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేయటం దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియమ్మ గుడిని కట్టనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. సోనియమ్మ గుడి అంటూ కొంతకాలం హడావుడి చేసినా.. తర్వాత దాని ఊసే మాట్లాడకపోవటం వేరే సంగతి. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరంగల్ ఓటర్లు షాకివ్వటం తెలిసిందే. భారీ మెజార్టీతో టీఆర్ ఎస్ అభ్యర్థికి సంచలన మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో.. సదరు ఫలితంపై ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ కాదని.. అభ్యర్థి సర్వే సత్యనారాయణ అంటూ చిత్రమైన వాదనను వినిపించారు. సర్వే లోకల్ క్యాండిడేట్ కాకపోవటం వల్లనే ఓడిపోయారని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన సర్వేకు డిపాజిట్ కూడా దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసిన శంకర్రావ్.. ఓటమికి సరికొత్త భాష్యం చెప్పటంపై అటు కాంగ్రెస్ నేతలకు విస్మయాన్ని కలిగిస్తోంది. శంకర్రావ్ మాటలు చూస్తుంటే.. ఓడిపోయేది ఏదైనా.. అభ్యర్థి మాత్రమే కానీ పార్టీ కాదన్న సత్యం సరికొత్తగా అనిపించటం లేదు.
Tags:    

Similar News