'చెక్ చేస్తున్నానంటూ అక్కడ చేయి పెట్టాడు'... ఎఫ్ఐఆర్లో సంచలన అంశాలు

Update: 2023-06-02 13:03 GMT
బీజేపీ నేత రెజ్లర్ నుంచి లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న చరణ్ సింగ్ మీద ఢిల్లీ పోలీసు లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎఫ్ఐఆర్ లో అనేక సంచలన ఆరోపణలు కూడా నమోదు చేసిన అంశం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.

మహిళ అథ్లెట్లతో బ్రీజ్ భూషణ్ సింగ్ దారుణంగా ప్రవర్తించాడని వారి ఎద భాగం పై తాకడం అసభ్య పదజాలం ఉపయోగించే సంభాషించడం వంటివి చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేవాడని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

ఇక బ్రిజ్ భూషణ్ తమ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతదేశానికి చెందిన అనేక మంది రెజ్లర్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకున్న వారు సైతం గత కొద్దిరోజులుగా తమ డిమాండ్ ని గట్టిగా వినిపిస్తున్నారు.

ముఖ్యంగా ఢిల్లీ వేదికగా వేరు చేస్తున్న ప్రొటెస్ట్ గురించి దాదాపుగా దేశమంతా చర్చ జరుగుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయం మీద ఎలాంటి చర్యలకు దిగకపోవడం... నిజానికి ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదులు చేయడంతో ఢిల్లీ లోని కర్ణాటక ప్యాలెస్ పోలీస్ స్టేషన్లో గత నెల రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి.

ముందుగా ఆరుగురు మహిళా రిజర్వుల తో మొదటి ఎఫ్ఐఆర్ తర్వాత మరో మైనర్ రెసులర్ తండ్రి ఫిర్యాదు తో రెండో ఎఫ్ఐఆర్ ను ఏప్రిల్ 28వ తేదీన నమోదు చేయగా అందులో నమోదైన విషయాలు ఇప్పుడు తాజాగా వెళ్లడయ్యాయి. ఆయన దెబ్బకు భయపడి మహిళా అత్తిలిట్లు ఎప్పుడూ తమ గదుల్లోంచి బయటకు రావాలన్న జట్లు జట్లు గానే వచ్చేవారని అయినా సరే వారిలో నుంచి ఒకరిని పక్కకు తీసుకెళ్లి అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగే వారిని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

ఒకరోజు తన శ్వాస ప్రక్రియ చెక్ చేస్తున్నానంటూ టీ షర్ట్ లాగారని ఛాతి పై పొట్ట పై అభ్యంతరకరంగా తాగారని చెబుతూ ఒక అథ్లెట్ ఫిర్యాదులో పేర్కొనట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణల ను ఎప్పటికప్పుడు బ్రిజ్ భూషణ్ ఖండిస్తూనే వస్తున్న సంగతి తెలిసిందే.

Similar News