సుజనా చౌదరి వర్సెస్ 'సాక్షి' - 623 ఎకరాలు!
రాజధాని ప్రాంతంలో తనకు సెంటు భూమి లేదంటూ ప్రకటన చేసిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత పత్రిక 'సాక్షి' సంచలన కథనాన్ని ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి - ఆయన కుటుంబీకులు - ఆయన బినామీల పేరిట అక్షరాలా 623 ఎకరాల భూమి ఉందని సాక్షి తన కథనంలో పేర్కొంది. పైగా ఈ వివరాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బయటకు తీసిందని కూడా సాక్షి పేర్కొనడం విశేషం.
రాజధానిని తరలించడానికి వ్యతిరేకమంటూ ఆ ప్రాంతంలో సుజనా చౌదరి పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు చౌదరి. తెలుగుదేశం చిత్తు అయిన తర్వాత ఈయన పార్టీ మారారు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చలామణీలో ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అజెండానే అమలు చేస్తున్నారనే విశ్లేషణలూ ఈయన విషయంలో ఉన్నారు. ఈ క్రమంలో రాజధాని విషయంలో రాజకీయంలో సుజనా చౌదరి కూడా తలదూర్చారు.
అక్కడకు వెళ్లి తనకు సెంటు భూమి కూడా లేదని ప్రకటన చేశారు. ఇలాంటి నేపథ్యంలో సాక్షి ఈ కథనాన్ని ఇచ్చింది. ఆరు వందల ఇరవై మూడు ఎకరాల భూమి సుజనా చౌదరి బినామీల పేరిట ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఆ భూమి అంతా రాజధాని ఆ ప్రాంతంలో ఏర్పడుతుంది అనే ప్రకటన రాకముందే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని పేర్కొన్నారు. ఎకరా ఐదారు లక్షల రూపాయల ధరతో చాలా భూమిని కొనుగోలు చేశారని - అలాంటి కొనుగోళ్లు అన్నీ అయిన తర్వాతే అక్కడ రాజధాని ప్రకటన చేసినట్టుగా కథనంలో పేర్కొన్నడం విశేషం. సెంటు భూమి లేదన్న సుజనాచౌదరి ప్రకటనపై సాక్షి ఇలాంటి కథనాన్ని ఇచ్చింది. దీనిపై సుజనా చౌదరి ఎలా స్పందిస్తారో!
రాజధానిని తరలించడానికి వ్యతిరేకమంటూ ఆ ప్రాంతంలో సుజనా చౌదరి పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు చౌదరి. తెలుగుదేశం చిత్తు అయిన తర్వాత ఈయన పార్టీ మారారు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చలామణీలో ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అజెండానే అమలు చేస్తున్నారనే విశ్లేషణలూ ఈయన విషయంలో ఉన్నారు. ఈ క్రమంలో రాజధాని విషయంలో రాజకీయంలో సుజనా చౌదరి కూడా తలదూర్చారు.
అక్కడకు వెళ్లి తనకు సెంటు భూమి కూడా లేదని ప్రకటన చేశారు. ఇలాంటి నేపథ్యంలో సాక్షి ఈ కథనాన్ని ఇచ్చింది. ఆరు వందల ఇరవై మూడు ఎకరాల భూమి సుజనా చౌదరి బినామీల పేరిట ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఆ భూమి అంతా రాజధాని ఆ ప్రాంతంలో ఏర్పడుతుంది అనే ప్రకటన రాకముందే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని పేర్కొన్నారు. ఎకరా ఐదారు లక్షల రూపాయల ధరతో చాలా భూమిని కొనుగోలు చేశారని - అలాంటి కొనుగోళ్లు అన్నీ అయిన తర్వాతే అక్కడ రాజధాని ప్రకటన చేసినట్టుగా కథనంలో పేర్కొన్నడం విశేషం. సెంటు భూమి లేదన్న సుజనాచౌదరి ప్రకటనపై సాక్షి ఇలాంటి కథనాన్ని ఇచ్చింది. దీనిపై సుజనా చౌదరి ఎలా స్పందిస్తారో!