ఈ హీరోయిన్ ఇక్కడి నుంచి పోటీచేస్తుందట..!

Update: 2018-10-23 10:40 GMT
సినీ నటి రేష్మా ఇటీవలే బీజేపీలో చేరారు.. బీజేపీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీచేయాలని  ఉబలాటపడుతున్నారు. మహిళా కోటాలో ఆమెకు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా  వరించింది.  మొదట రేష్మా ఎస్టీ కావడంతో మహబూబాబాద్ ఎంపీ గా బీజేపీ తరఫున పోటీచేయాలని స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా ఆ పార్లమెంట్ పరిధిలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే మేలో ఉండడంతో అంతకంటే ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వైపు దృష్టిసారించారు.

తాజాగా రేష్మా రాథోడ్ వైరా నియోజకవర్గంలో బీజేపీ తరుఫున పోటీచేయాలని ఆసక్తి చూపుతున్నారట.. ఈ మేరకు ఆమె పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తన వినతిని కూడా అందించినట్లు తెలిసింది.

ఆమె స్వతహాగా ఖమ్మం జిల్లా వాసి. ఇల్లెందు - కారేపల్లి ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో   వైరా నుంచి పోటీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.. వైరాలో ఇప్పటికే టీఆర్ ఎస్ - కాంగ్రెస్ - వైసీపీ తరుఫున బలమైన అభ్యర్థులున్నారు. ఈమెకు ఆశలు లేకున్నా పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని ఆమె భావిస్తున్నట్టు తెలిసింది.
Tags:    

Similar News