తాడేపల్లిలో ప్రేమజంట మీద దాడి.. యువతిపై అత్యాచారం

Update: 2021-06-20 09:19 GMT
గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రేమజంట పుష్కరఘాట్ లోని ఇసుకలో కూర్చోవటమే వారు చేసిన పెద్ద తప్పుగా మారింది. శనివారం రాత్రి వేళలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ఉదంతం తాజాగా సంచలనంగా మారింది.

తాడేపల్లి  పుష్కరఘాట్ లోని ఇసుక తిన్నెల మీద కూర్చున్నారో ప్రేమజంట. వారు అలా ఉన్న వేళ.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీన్ని ప్రతిఘటించిన యువకుడి మీద దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఆ యువకుడ్ని తాళ్లతో కట్టేశారు.

అనంతరం ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తాము చేసిన పనిని ఎవరికైనా చెబితే ప్రమాదమని హెచ్చరించి వెళ్లిపోయారు. అనంతరం బాధిత యువకుడు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన వారు యువతిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి షాక్ లో ఉన్నట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దారుణానికి పాల్పడిన వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News