అమ్మ లేకపోవడంతో అందరికీ కొమ్ములొచ్చాయట

Update: 2017-03-26 07:57 GMT
జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు.  జయలలిత మరణానంతం అందరికీ మాట్లాదే ధైర్యం వచ్చిందని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు.
    
జయలలిత మరణం తరువాత బాధ్యతాయుతమైన నాయకుడు లేడని, తమిళ ప్రభుత్వం భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని, ఇంకా చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వ పాలనే ప్రశ్నార్థకంగా ఉందని వ్యాఖ్యానించారు. అనూహ్యంగా నాయకుడిని ఎంచుకోరాదని... ఇప్పుడున్న నాయకుడిని చూసి ప్రజలు ఓట్లేయలేదని.. అమ్మను చూసి ఓట్లేశారని.. అలా గెలిచిన శాసనసభ్యుల మద్దతుతోనే ఇప్పుడున్న నాయకుడు సీఎం అయ్యారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
    
కాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ దానికి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు.  ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నిర్మాతల మండలి కోసం వారిని తాము కలిసి మాట్లాడతామని తెలిపారు. కాగా జయ లేకపోవడంతో అందరికీ ధైర్యం వచ్చిందన్న ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు తమిళనాడులో రకరకాల భాష్యాలు చెబుతున్నారు. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆయన వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News