మావయ్య చంద్రబాబు - లోకేశ్ త్వరగా కోలుకోవాలి: జూ.ఎన్టీఆర్

Update: 2022-01-18 16:30 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేశ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వీరు మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు - లోకేష్ లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

''మావయ్య చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలి కోరుకుంటున్నాను. గెట్ వెల్ సూన్'' అని ఎన్టీఆర్ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. నందమూరి వారసుడి ట్వీట్ అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

చంద్రబాబు - లోకేష్ ఇద్దరూ తమకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. అలానే మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ ''నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేశ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను! దయచేసి జాగ్రత్తగా ఉండండి.. త్వరగా కోలుకోండి!'' అని పేర్కొన్నారు.
Tags:    

Similar News