దిగ్గజ కుటుంబాలు సైకిల్ దిగుతున్నాయా?

Update: 2019-07-17 10:24 GMT
టీడీపీలో తిరుగులేని కుటుంబాలన్ని వైసీపీ హోరులో కొట్టుకుపోయాయి. కనీసం టీడీపీ బోణి కొట్టని జిల్లాల్లో కర్నూలు ఒకటి. ఈ జిల్లాలో టీడీపీ నుంచి కోట్లా ఫ్యామిలీ, కేఈ ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీలు తిరుగులేని రాజకీయం చేశాయి. వైసీపీ ధాటికి వీరంతా ఓడిపోయి సైలెంట్ అయ్యారు.

అయితే అధికారం కోల్పోవడంతో వీరంతా ఇప్పుడు పక్కచూపులు చూస్తుండడం టీడీపీకి షాక్ లా మారింది. ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ చంద్రబాబుకు షాకిచ్చి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు మిగతా వారు కూడా అదే బాటలో నడిచేందుకు సంప్రదింపులు జరుపుతుండడం కలవరపెడుతోంది. ఇది జిల్లాలో టీడీపీలో పెను సంక్షోభాన్ని సృష్టించబోతోందన్న చర్చ సాగుతోంది.

మాజీ డిప్యూటీ సీఎం కేఈ ఫ్యామిలీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారట.. రెండు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఇస్తామంటున్నారట.. టీడీపీలో ఉంటే అంతే సంగతులు అన్న ధోరణితో వీళ్లు బీజేపీ వైపు ఆసక్తిగా చూస్తున్నారట..

ఇక వైసీపీలోకి వెళ్లడానికి విశ్వప్రయత్నం చేస్తున్న భూమా  అఖిలప్రియకు జగన్ దగ్గరకే రానీయడం లేదట.. ఇక భూమా ఫ్యామిలీతోపాటు జిల్లాలో ఓడిన మాజీ ఎమ్మెల్యేలందరితో కలిసి బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారట..  కోట్లా ఫ్యామిలీ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారట.. వీరంతా కనుక సైకిల్ దిగితే టీడీపీ కోలుకోవడం  కష్టమేనంటున్నారు.

    

Tags:    

Similar News