ఇథియోపియాలో హైదరాబాదీ హత్య

Update: 2019-03-21 07:50 GMT
ఇథియోపియాలో దారుణం జరిగింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారి శశిధర్ ను దుండగులు దారుణంగా చంపేశారు. కారులోనే సజీవ దహనం చేశారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో నివాసముండే శశిధర్ వివిధ వ్యాపారాలు చేస్తుంటాడు. బాలానగర్ సమీపంలో పంటల ఉత్పత్తులు - ఇతర వస్తువులు నిల్వ చేసే గిడ్డంగి వ్యాపారంతో పాటు అండమాన్ నికోబార్ లో సీఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ చేస్తుంటారు. పాతికేళ్లుగా ఆయనీ వ్యాపారంలో ఉండి వివిధ దేశాలకు విస్తరిస్తున్నారు.

తాజాగా ఇథియోపియాలో రాగి గనుల వ్యాపారం చేసేందుకు అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. అన్నీ పనులు పూర్తై గనులు చూసేందుకు రెండు బృందాలు వెళ్లాయి. రెండు కార్లలో గనుల్ని చూసేందుకు వెళుతుండగా.. కొందరు గుర్తు తెలియని దుండగులు కారుకు నిప్పు అంటించి ఐదుగురిని చంపేశారు. అలా మరణించిన వారిలో శశిధర్ కూడా ఉన్నారు. అయితే శశిధర్ కారును ఎందుకు హత్య చేశారన్నది తెలియరాలేదు.

కాగా భర్త చనిపోయిన విషయం హైదరాబాద్ లో ఉంటున్న భార్యకు తెలియనీయలేదు. ఆమెకు గుండె జబ్బులు ఉండడంతో విషయాన్ని దాచారు. మృతదేహాన్ని దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News