తిరుపతి లోక్ సభలో పోటీకి బీజేపీ సై
సోము వీర్రాజు.. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన మంచి దూకుడు మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపడుతామంటూ భరోసాతో ఉన్నారు. అంతేకాదు.. ఇటీవల ఏపీ ప్రభుత్వం మీద కూడా విమర్శల అస్త్రం సంధిస్తున్నారు. ప్రభుత్వ చర్యలను టార్గెట్ చేస్తూ నిరసన కార్యక్రమాలూ చేపట్టారు. హిందుత్వమే ప్రధాన ఏజెండాతో నడిచే బీజేపీకి.. ఇప్పుడు ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులూ కలిసొచ్చాయి.
ఇదిలా ఉండగా.. ఇటీవల వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో తిరుపతి లోక్సభ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి జరగనున్న ఉప ఎనికల బరిలో బీజేపీ కూడా నిలవాలని డిసైడ్ అయింది. ఈ మేరకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో సోము వీర్రాజు తన నిర్ణయాన్ని ప్రకటించారు. అక్కడ పోటీ చేసి పార్టీ బలం నిరూపించాలని వీర్రాజు పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ముందు నుంచీ బీజేపీకి కొంచెం చెప్పుకోదగ్గ చరిత్రనే ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా ఆ సీటు బీజేపీకి వచ్చేది. అక్కడి నుంచి ఎన్.వెంకటస్వామి ఓ సారి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు దక్కినా.. కొద్ది తేడాతో ఓటమి పాలైంది. 2009లో మాత్రం విడిగా పోటీ చేసి 20 వేల ఓట్లు తెచ్చుకోగలిగింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో తమకు బాగా క్యాడర్ ఉందని ఇప్పటికీ బీజేపీ నమ్మకం. అందుకే బలం నిరూపించుకోవడానికి ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.
మరికొద్ది రోజుల్లోల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటితోపాటే దేశంలో ఎక్కడెడక్కడ ఖాళీ స్థానాలు ఉన్నాయో వాటికీ ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలపై వైసీపీ, టీడీపీ ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. సాధారణంగా సిట్టింగ్ సభ్యుడు చనిపోయినప్పుడు వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తూ ఉంటారు. అలా చేస్తే వేరే పార్టీ దాదాపు పోటీలో ఉండదు. ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉండగా.. ఇటీవల వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో తిరుపతి లోక్సభ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి జరగనున్న ఉప ఎనికల బరిలో బీజేపీ కూడా నిలవాలని డిసైడ్ అయింది. ఈ మేరకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో సోము వీర్రాజు తన నిర్ణయాన్ని ప్రకటించారు. అక్కడ పోటీ చేసి పార్టీ బలం నిరూపించాలని వీర్రాజు పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ముందు నుంచీ బీజేపీకి కొంచెం చెప్పుకోదగ్గ చరిత్రనే ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా ఆ సీటు బీజేపీకి వచ్చేది. అక్కడి నుంచి ఎన్.వెంకటస్వామి ఓ సారి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు దక్కినా.. కొద్ది తేడాతో ఓటమి పాలైంది. 2009లో మాత్రం విడిగా పోటీ చేసి 20 వేల ఓట్లు తెచ్చుకోగలిగింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో తమకు బాగా క్యాడర్ ఉందని ఇప్పటికీ బీజేపీ నమ్మకం. అందుకే బలం నిరూపించుకోవడానికి ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.
మరికొద్ది రోజుల్లోల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటితోపాటే దేశంలో ఎక్కడెడక్కడ ఖాళీ స్థానాలు ఉన్నాయో వాటికీ ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలపై వైసీపీ, టీడీపీ ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. సాధారణంగా సిట్టింగ్ సభ్యుడు చనిపోయినప్పుడు వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తూ ఉంటారు. అలా చేస్తే వేరే పార్టీ దాదాపు పోటీలో ఉండదు. ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు.