ఏపీలో కొత్తగా 9276 కరోనా కేసులు

Update: 2020-08-01 12:58 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9,276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో పేర్కొంది.దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1.50లక్షలు దాటాయి.

గడిచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 60,797 టెస్టులు చేశారు. ఇందులో 9276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,209కి చేరాయి. కరోనాతో ఒక్కరోజులోనే ఏకంగా 58మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 1407మంది మృతి చెందారు.

ఇక ఏపీలో 72,188మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 76,614మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు అత్యధికంగా 12,750మంది కరోనా నుంచి కోలుకున్నారని బులిటెన్ లో తెలిపారు. ఇప్పటిదాకా ఏపీలో ఏకంగా 20,12,573 టెస్టులు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News