ప్రపంచంలోనే 15శాతం మంది మహిళా పైలట్లు భారత్ లోనే?

Update: 2022-07-22 00:30 GMT
జనాభాలో సగం ఉన్న మహిళలు.. ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ సగ భాగం ఉండాలన్న నియమం ఉంది. కానీ ఈ విషయంలో పాశ్చాత్యా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆ రేషియో లేదు. కానీ మన భారత్ లో మహిళల సంఖ్య చాలా ఎక్కువ. భారతీయ మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. సాఫ్ట్ వేర్ , రాజకీయాలు, వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.

విమానయాన రంగాన్ని మన భారతీయ మహిళలు ఏలుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలోనే అత్యధిక స్థాయిలో మహిళా పైలట్లు ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే .. మన దేశంలోనే మహిళా పైలట్లు అధికంగా ఉన్నట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ తాజాగా నివేదిక స్పష్టం చేసింది.

ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్ లైన్స్ ప్రకారం.. ప్రపంచంలోని మొత్తం పైలట్లలో 5శాతం  మంది మహిళలు ఉండగా.. భారతదేశంలో మహిళా పైలట్ల సంఖ్య 15శాతం ఉందని ప్రభుత్వం గురువారం లోక్ సభ కు తెలిపింది.

లోక్ సభలో డాక్టర్ వీ సత్యావతి, చింతా అనురాధ అడిగిన ప్రశ్నకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.  దేశంలో మహిళా పైలట్ల సంఖ్య పెంచేందుకు తీసుకున్న చర్యల వివరాలను సభ్యులు కోరగా సింధియా వివరణ ఇచ్చారు.

దేశంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా పైలట్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. పైలట్ల సంఖ్యను పెంచడానికి, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదటి దశలో ఐదు విమానాశ్రయాలలో తొమ్మిది కొత్త ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కోసం ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా అవార్డు లెటర్ లను జారీ చేసింది.

ఈ ఐదు విమానాశ్రయాల్లో భావ్ నగర్, హుబ్లీ, కౌపా, కిషన్ గఢ్ మరియు సేలంలలో రెండో దశలో మరో ఆఱ్ ఎఫ్.టీఓ స్లాట్ లను చేర్చినట్లు కేంద్రమంత్రి సింధియా తెలిపారు. ఈ చర్యల వల్ల విమాన శిక్షణా సంస్థలలో ఫ్లైయింగ్ గంటలు, సంవత్సరానికి జారీ చేయబడిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి తెలిపారు.
Tags:    

Similar News