మినీ సంగ్రామం 2026: ఐదు రాష్ట్రాల ఫలితాల లైవ్ అప్డేట్స్!
హంగ్ దిశగా తమిళనాడు అసెంబ్లీ.. 118 సీట్లు వస్తేనే విజయ్ సీఎం
తమిళనాట హంగ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 100 సీట్లు దాటేసిన టీవీకే విజయ్ .. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు ఇంకో 18 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో హంగ్ వస్తే అన్నాడీఎంకే మద్దతు టీవీకే విజయ్ కు తప్పనిసరి.. లేదంటే డీఎంకే మద్దతు అయినా కావాలి. విజయ్ ఎవరిది తీసుకుంటారు? లేదంటే సొంతంగా మెజార్టీకి చేరువు అవుతాడా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
మ్యాజిక్ ఫిగర్ కు చేరువగా తమిళనాట టీవీకే విజయ్
టీవీకే విజయ్ : 103+ ఆధిక్యం
అన్నాడీఎంకే : 74+ ఆధిక్యం
డీఎంకే :53 ఆధిక్యం
ఇతరులు : 0
పశ్చిమ బెంగాల్ లో 293 అసెంబ్లీ సీట్లు
బీజేపీ : 146 సీట్లతో అధికారం దిశగా సాగుతోంది..
టీఎంసీ : 121 సీట్లతో 2వ స్థానంలో ఉంది.
కాంగ్రెస్ : 5
లెఫ్ట్ : 3
ఇతరులు : 5 సీట్లు
వెనుకంజలో తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం. ఎంకే. స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.
కేరళ సీఎం ఎవరు? కాంగ్రెస్ లో కేసీ వేణుగోపాల్ ? సదీశన్? పోటాపోటీ
కేరళలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ అధికారంలోకి రావడం ఖాయమైంది. మరి కాంగ్రెస్ లో సీఎం ఎవరు అన్నది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్ సీఎం రేసులో ముందున్నారు. ఆయన తర్వాత కేరళ కాంగ్రెస్ నేత సదీశన్ పోటీనిస్తున్నారు. ఎవరు అవుతారన్నది చూడాలి.
కేరళలో 140 సీట్లు
యూడీఎఫ్ : 90 సీట్లతో అధికారం దిశగా..
అధికార ఎల్డీఎఫ్ : 47 స్థానాలతో ముందంజ
బీజేపీ : 3+ స్థానాలతో
ఇతరులు : 0
పశ్చిమ బెంగాల్ లో 293 అసెంబ్లీ సీట్లు
బీజేపీ :143 సీట్లతో లీడ్ లో ఉంది
టీఎంసీ : 119 సీట్లతో 2వ స్థానం
కాంగ్రెస్ : 6
లెఫ్ట్ : 3
ఇతరులు : 5 సీట్లు
తమిళనాట టీవీకే విజయ్ ప్రభంజనం
టీవీకే విజయ్ : 102+ ఆధిక్యం
అన్నాడీఎంకే : 69+ ఆధిక్యం
డీఎంకే :57 ఆధిక్యం
మమతా బెనర్జీని వదలని సువేందు అధికారి
బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ. భవానీపూర్ నియోజకవర్గంలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఆధిక్యం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ నేత సువేందు అధికారి కఠిన పోటీ ఇవ్వడమేనని రాజకీయ విశ్లేషకులు ముందున్నారు.
ఒకప్పుడు మమతా బెనర్జీకి ఆప్తుడిగా ఉన్న సువేందు అధికారి, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో ఆమెకు షాక్ ఇచ్చి గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఓటమితో సీఎం పదవి కొనసాగాలంటే భవానీపూర్ ఉపఎన్నికల్లో మమత తప్పనిసరిగా గెలవాల్సి వచ్చింది.
ప్రస్తుతం భవానీపుర్లోనూ అదే తరహా పోటీ కనిపిస్తుండగా, సువేందు అధికారి మళ్లీ 2021 సన్నివేశాన్ని పునరావృతం చేస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పోటీ బెంగాల్ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.
బెంగాల్ లో దూసుకుపోతున్న బీజేపీ.. మమతకు భంగపాటు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 155 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి.. మెజార్టీ మార్క్ను దాటేసింది.
అధికార పార్టీ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ 107 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 4, లెఫ్ట్ పార్టీలు 3 స్థానాల్లో అధికారంలో ఉన్నాయి.
ఈ పరిణామాలతో కోల్కతాలోని టీఎంసీ కార్యాలయం వద్ద నిశ్శబ్ద వాతావరణం. కార్యకర్తల సందడి కనిపించకపోవడం. మరోవైపు న్యూఢిల్లీలో బీజేపీ శిబిరంలో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి.