మినీ సంగ్రామం 2026: ఐదు రాష్ట్రాల ఫలితాల లైవ్ అప్డేట్స్!
వెనుకంజలో తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం. ఎంకే. స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.
కేరళ సీఎం ఎవరు? కాంగ్రెస్ లో కేసీ వేణుగోపాల్ ? సదీశన్? పోటాపోటీ
కేరళలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ అధికారంలోకి రావడం ఖాయమైంది. మరి కాంగ్రెస్ లో సీఎం ఎవరు అన్నది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్ సీఎం రేసులో ముందున్నారు. ఆయన తర్వాత కేరళ కాంగ్రెస్ నేత సదీశన్ పోటీనిస్తున్నారు. ఎవరు అవుతారన్నది చూడాలి.
కేరళలో 140 సీట్లు
యూడీఎఫ్ : 90 సీట్లతో అధికారం దిశగా..
అధికార ఎల్డీఎఫ్ : 47 స్థానాలతో ముందంజ
బీజేపీ : 3+ స్థానాలతో
ఇతరులు : 0
పశ్చిమ బెంగాల్ లో 293 అసెంబ్లీ సీట్లు
బీజేపీ :143 సీట్లతో లీడ్ లో ఉంది
టీఎంసీ : 119 సీట్లతో 2వ స్థానం
కాంగ్రెస్ : 6
లెఫ్ట్ : 3
ఇతరులు : 5 సీట్లు
తమిళనాట టీవీకే విజయ్ ప్రభంజనం
టీవీకే విజయ్ : 102+ ఆధిక్యం
అన్నాడీఎంకే : 69+ ఆధిక్యం
డీఎంకే :57 ఆధిక్యం
మమతా బెనర్జీని వదలని సువేందు అధికారి
బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ. భవానీపూర్ నియోజకవర్గంలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఆధిక్యం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ నేత సువేందు అధికారి కఠిన పోటీ ఇవ్వడమేనని రాజకీయ విశ్లేషకులు ముందున్నారు.
ఒకప్పుడు మమతా బెనర్జీకి ఆప్తుడిగా ఉన్న సువేందు అధికారి, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో ఆమెకు షాక్ ఇచ్చి గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఓటమితో సీఎం పదవి కొనసాగాలంటే భవానీపూర్ ఉపఎన్నికల్లో మమత తప్పనిసరిగా గెలవాల్సి వచ్చింది.
ప్రస్తుతం భవానీపుర్లోనూ అదే తరహా పోటీ కనిపిస్తుండగా, సువేందు అధికారి మళ్లీ 2021 సన్నివేశాన్ని పునరావృతం చేస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పోటీ బెంగాల్ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.
బెంగాల్ లో దూసుకుపోతున్న బీజేపీ.. మమతకు భంగపాటు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 155 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి.. మెజార్టీ మార్క్ను దాటేసింది.
అధికార పార్టీ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ 107 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 4, లెఫ్ట్ పార్టీలు 3 స్థానాల్లో అధికారంలో ఉన్నాయి.
ఈ పరిణామాలతో కోల్కతాలోని టీఎంసీ కార్యాలయం వద్ద నిశ్శబ్ద వాతావరణం. కార్యకర్తల సందడి కనిపించకపోవడం. మరోవైపు న్యూఢిల్లీలో బీజేపీ శిబిరంలో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి.
తమిళనాడులో విజయ్ కింగ్ నా? కింగ్ మేకరా?
అధికార డీఎంకే ఆధిక్యం : 50+ స్థానాలు
ప్రతిపక్ష అన్నాడీఎంకే : 69+
టీవీకే విజయ్ :97 స్థానాల్లో ఆధిక్యం
దీన్ని బట్టి టీవీకే విజయ్ కింగ్ అయ్యి సీఎం అవుతారా? కింగ్ మేకర్ గా నిలుస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
యానాంలో మల్లాడి కృష్ణారావు ఆధిక్యం
యానాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో తొలి రౌండ్ ఫలితం వెలువడింది. మొదటి రౌండ్లో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఆధిక్యంలో నిలిచారు. ఆయనకు 4,413 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోష్కు 3,917 ఓట్లు వచ్చాయి. దీంతో మల్లాడి కృష్ణారావు 496 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తం ఐదు రౌండ్లలో భాగంగా ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది.
పుదుచ్చేరిలో బీజేపీ 22+ స్థానాలతో బీజేపీదే అధికారం
మొత్తం 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో బీజేపీ 22 స్తానాలతో అధికారం సుసాధ్యం చేసుకుంది. కాంగ్రెస్ 6 స్థానాలతో అధిక్యంలో ఉన్నారు. ఇతరులు 1 స్థానాల్లో ఉన్నారు.