ఆ విషయంలో జగన్ ని ఏ-3 చేసిన షర్మిల... కామెంట్స్ వైరల్!
అవును... అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీపై పీసీసీ చీఫ్ షర్మిల ముందస్తుగా నిప్పులు చెరిగారు.;
ఏపీలో మరోసారి టీడీపీ - బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోడీ హాజరవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ సమయంలో గతంలో చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి అంటూ మొదలుపెట్టి తీవ్ర విమర్శలు గుప్పించారు షర్మిల.
అవును... అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీపై పీసీసీ చీఫ్ షర్మిల ముందస్తుగా నిప్పులు చెరిగారు. గతంలో చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చిపోయారు.. ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారని.. అమరావతిని శంకుస్థాపనల ప్రాజెక్ట్ గా అమరావతిని మార్చేశారంటూ ఫైర్ అయ్యారు.
ఇందులో భాగంగా... ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టిన మోడీ.. ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారని మొదలుపెట్టిన షర్మిల.. చివరికి ఆత్మగౌరవం అమరావతిని "మోడీ శంకుస్థాపనల ప్రాజెక్ట్" కింద మార్చేశారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసమని ఫైరయ్యారు.
ఇదే సమయంలో... పోలవరం ఎత్తు తగ్గించి తీరని అన్యాయం చేసి.. రూ.15వేల కోట్లు అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటని ఏపీ పీసీసీ చీఫ్ ఫైరయ్యారు. నిజంగా అమరావతిపై మోడీకి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు గాడిదలు కాశారా? రాజధాని పనులపై ఒక్కనాడైనా బాధ్యతగా అడిగారా? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో.. ఒక్క రూపాయి నిధులైనా అమరావతికి కేటాయించారా? 3డీ గ్రాఫిక్స్ అమలు సంగతేంటని చంద్రబాబును ప్రశ్నించారా? గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతుంటే వేడుక చూసింది మీరు కాదా? ఇది తప్పని మీ దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు? అని నిలదీశారు.
ఇదే క్రమంలో.. నాడు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారో మోడీ సమాధానం చెప్పాలని ప్రశ్నించి షర్మిల... 10 ఏళ్లు దాటినా రాష్ట్రానికి రాజధాని లేదంటే ఇందుకు ప్రధాన ముద్దాయి ఏ1 మోడీ.. ఏ2 చంద్రబాబు.. ఏ3 జగన్ అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
ఈ సందర్భంగా వచ్చే నెల 2న అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న మోడీని ఏపీ కాంగ్రెస్ పక్షాన్న డిమాండ్ చేస్తున్నట్లు చెబుతూ పలు విషయాలను లేవనెత్తారు షర్మిల. ఇందులో భాగంగా... ఏపీ నూతన రాజధాని నిర్మాణం విభజన హామీల్లో ఒకటని.. ఇది కేంద్రమే పూర్తి నిధులతో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ అని గుర్తుచేశారు.
ఈ సమయంలో 10 ఏళ్ల ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎస్.ఏ.ఐ.ఎల్. విలీనంతో పాటు.. కడప స్టీల్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు వంటి పెండింగ్ విభజన హామీలపై వైఖరి తేల్చాలని మోడీ క్లారిటీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.