పవన్ కంటే ముందు వరుణ్ ఆ రీమేక్ చేయబోతున్నాడు!

Update: 2023-02-06 05:00 GMT
కోలీవుడ్ సూపర్‌ హిట్‌ పోలీస్‌ స్టోరీ చిత్రం 'తేరి' ని తెలుగు లో పవన్‌ కళ్యాణ్ రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు.. రీమేక్ చేయబోతున్నాడు అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్ టైటిల్ తో ఈ సినిమా యొక్క రీమేక్ ను ప్రకటించడం జరిగింది.

పవన్ కళ్యాణ్‌ రాజకీయాలతో బిజీగా ఉండటంతో పాటు ఇతర సినిమాలు వరుసగా ఉన్న కారణంగా ఉస్తాద్‌ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు అనే విషయం లో స్పష్టత లేదు. తేరి సినిమా రీమేక్ కోసం పవన్‌ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం అందరికి తెల్సిందే.

ఒక వైపు పవన్ కళ్యాణ్ రీమేక్ ను ప్రకటించి వదిలి వేయగా మరో వైపు బాలీవుడ్ యంగ్ స్టార్‌ వరుణ్‌ దావన్‌ తేరి సినిమా యొక్క రీమేక్ లో నటించేందుకు గాను గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా మొదలు అయ్యిందని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఒరిజినల్‌ వర్షన్ కు దర్శకత్వం వహించిన అట్లీ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌ తో పఠాన్ సినిమాను చేస్తున్న అట్లీ ఇదే ఏడాది సెప్టెంబర్‌ లో తేరి రీమేక్ ను వరుణ్ దావన్‌ తో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు పవన్‌ తేరి రీమేక్ గురించి చర్చ లు జరుగుతున్న ఈ సమయంలోనే మరో వైపు వరుణ్ దావన్‌ తేది వచ్చేలా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News