పిల్లల్ని కనడం 20 ఏళ్ల ప్రాజెక్ట్

Update: 2017-09-24 09:27 GMT
తన సినిమాలతో టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఘనుడు మెగాస్టార్ చిరంజీవి. ఒకప్పుడు రాజకీయాల వల్ల సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన చిరు.. తనయుడైని రామ్ చరణ్ ను రంగం లోకి దింపిన విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ తనకంటూ ఒక స్టార్ డమ్ ని సంపాదించుకొని మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. తండ్రి కి తగ్గ తనయుడిగా మెగా ఫ్యామిలి కి  మంచి పేరు తెచ్చాడు.

ఇక అతని వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఐదేళ్ల క్రితం ఉపాసన ని పెళ్లి చేసుకున్నాడు. దంపతులిద్దరూ అన్యోన్యతతో మేలుగుతూ హ్యాపీగా ఉంటున్నారు.
అయితే గత కొంత కాలంగా మెగా అభిమానులు  అయితే మెగా మనవడు ఎప్పుడు వస్తాడో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ రామ్ చరణ్ దంపతులు ఇంకా బ్యాచిలర్ లైఫ్ అనేలా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. మెగా వారసుడు ఎప్పుడు వస్తాడు అన్న ప్రశ్నకు రీసెంట్ ఉపాసన సమాధానం ఇచ్చింది. పిల్లల్ని కనడం 20 ఏళ్ల ప్రాజెక్ట్ అని చెబుతూ.. ఏ టైములో కనాలో తమకు తెలుసని సమాధానం ఇచ్చారు ఉపాసన. అంతే కాకుండా పిల్లలు 20 ఏళ్ల వయసులోకి వచ్చే సరికి తాము గర్వంగా ఫీల్ అయ్యేలా ఉండాలని వివరించారు.

ఇక రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తూ.. మొదట చరణ్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ప్రతి చిన్న విషయంలో నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ నిర్ణయం అయినా ఇద్దరం ఆలోచించి తీసుకుంటాం. అందులో చరణ్ చాలా కూల్ గా ఉంటారు. ఇక తాను ఆఫీస్ పనుల్ని పూర్తి చేసికొని వస్తే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చెబుతూ.. నేను చేసే వంటల్ని కూడా చాలా ఇష్టపడతాడాని చెర్రీ చాలా స్వీట్ పర్సన్ అని ఉపాసన వివరించారు.
Tags:    

Similar News