పవన్ ఫ్యాన్స్ కు చిర్రెత్తించే ప్రాజెక్ట్ తో రానున్న ఆర్జీవీ?

Update: 2019-12-16 13:01 GMT
రామ్ గోపాల్ వర్మ సినిమాల ఫలితాలు ఎలాగైనా ఉండనివ్వండి.. దాంతో సంబంధం లేకుండా హాట్ టాపిక్ అవుతాయి. వివాదాలకు కేంద్ర బిందువుగా మారతాయి.  కొందరికి చిరాకు తెప్పిస్తాయి.  మరికొందరికి కిరాకు అనిపిస్తాయి.  'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' తర్వాత  అదేదో డ్రాగన్ సినిమాతో వస్తున్నాడని ఈసారి వర్మ తన ప్రతాపంతో చైనావారికి 'సినిమా' చూపిస్తాడని అనుకుంటున్నారు. ఇలా పూజా భలేకర్ స్పైసీ మార్షల్ ఆర్ట్స్ పై ఒక వైపు చర్చలు జరుగుతూ ఉంటే మరోవైపు వర్మ మరో వివాదాస్పద సినిమాకు శ్రీకారం చుడుతున్నాడట.

ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పూర్తిస్థాయి స్పూఫ్ సినిమా తీసే ప్రయత్నాలలో ఉన్నాడట.  'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' సినిమాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పోలిన ఒక పాత్రను చూపించాడు కానీ మెయిన్ ఫోకస్ చంద్రబాబు నాయుడు పాత్ర పైనే ఉంది. చంద్రబాబు.. లోకేష్ లను పోలిన పాత్రలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ ను పోలిన పాత్ర పెద్దగా సూట్ కాలేదు.  ఈసారి అలా కాకుండా పూర్తిగా పవన్ పైనే సినిమా తీయాలని.. పవన్ కళ్యాణ్ పాత్రే ప్రధానంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట.  ఈమధ్య 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' లో పవన్ పాత్రను చూపించినందుకు పవన్ ఫ్యాన్స్ ఆర్జీవీని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఆర్జీవీ ఫోటోకు దండ వేసి మరీ శ్రద్ధాంజలి ఘటించారు. కొందరేమో దేవభాషలో దండకాలు అందుకున్నారు. ఇదంతా ఆర్జీవి మదిలో ఉన్న పవన్ స్పూఫ్ సినిమా ఆలోచనను మరింతగా బలపరిచాయట.  

ఈ సినిమా కనుక తెరకెక్కితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ Vs రామ్ గోపాల్ వర్మ రచ్చ మీడియాను షేక్ చెయ్యడం ఖాయం. మరి ఈ ప్రాజెక్టు నిజంగానే పట్టాలెక్కిస్తాడా లేక మంచి కాఫీ తాగి 'మెగా ఫ్యామిలీ' ని పక్కన పెట్టినట్టు పక్కన పెట్టేస్తాడా అనేది వేచి చూడాలి.


Tags:    

Similar News