పవర్ స్టార్ పరువు తీసేసిన రాంగోపాల్ వర్మ

Update: 2016-05-01 07:47 GMT
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కేంద్రాన్ని అడుక్కోవడం మానాలంటూ భగ్గుమన్నారు.. అలా అడుక్కోవడానికి నువ్వు బెగ్గర్ సింగ్ వి కాదు -గబ్బర్ సింగ్ కావాలి అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పవన్ ను టార్గెట్ చేసి చీల్చి చెండాడేశారు.

అంతేకాదు... మొన్నటి ఎన్నికల్లో పవన్ మాటలు - ప్రచారాన్ని నమ్మి  ఓట్లు వేసిన కాపులను పవన్ మోసం చేశాడంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  పవన్ తీరు చూసి ఆయన అభిమానులు కూడా తట్టుకోలేక పోతున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ కన్నా - అల్లు అర్జున్ సరైనోడు చిత్రం పెద్ద విజయం సాధించిందంటూ పవన్ ను ఏకిపడేశారు.

కాగా నిన్న పవన్ ప్రత్యేక హోదా విషయంలో ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని... కాంగ్రెస్ లా చేయకూడదంటూ పవన్ ట్విట్టర్ లో సూచించారు. టీడీపీ ఎంపీలు హోదా కోసం పోరాడాలని... ప్రతిపక్ష ఎంపీలనూ కలుపుకోవాలని సుద్దులు చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ సాఫ్టు టోన్ చూసి మండిపడిన వర్మ అదే ట్విట్టర్ లో ఘాటైన కామెంట్లు చేయడం సంచలనం రేపుతోంది. గతంలో పలుమార్లు పవన్ ను వెనకేసుకొచ్చిన వర్మ ఈసారి మాత్రం ఒక రేంజిలో విరుచుకుపడ్డారు.
Tags:    

Similar News