రకూల్‌ మూడు సార్లు బ్రిటన్‌ వెళ్తోంది

Update: 2015-08-04 05:37 GMT
రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ క్షణం తీరికలేని షెడ్యూళ్ల తో సతమతమవుతోంది. హైదరాబాద్‌ నుంచి బ్రిటన్‌ విమానయానం చేస్తోంది. తాజాగా ఈ భామ ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న మా నాన్నకు ప్రేమతో సినిమా కోసం బ్రిటన్‌ వెళ్లింది. సుధీర్ఘమైన షెడ్యూల్‌ ఇది. అక్కడ షెడ్యూల్‌ పూర్తయ్యాక తిరిగి బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌ పయనమవుతుంది.

హైదరాబాద్‌ లో చరణ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌ లోని సినిమాకి రెడీ అవుతుంది. చరణ్‌ తో కొత్త షెడ్యూల్‌ కోసం ముచ్చటగా మూడోసారి బ్రిటన్‌ పయనమవుతుంది. అక్కడ కొంతకాలం షూటింగులో పాల్గొంటుంది. తర్వాత బన్ని-బోయపాటి సినిమా కోసం హైదరాబాద్‌ కి తిరిగొస్తుంది.

కిక్‌2 త్వరలో రిలీజ్‌ కాబోతోంది. కాబట్టి మధ్యలో ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ లో హల్‌చల్‌ చేస్తుంది. అలాగే ఎన్టీఆర్‌ సినిమా సుదీర్ఘ కాలం తెరకెక్కనుంది. రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు వంటి ప్రముఖులు ఈ షూటింగులో పాల్గొంటున్నారు. సీనియర్‌ నటులతో రకూల్‌ నటించే సన్నివేశాలు తెరకెక్కనున్నాయి.
Tags:    

Similar News