అప్పుడు జక్కన్న.. ఇప్పుడు కూతురు

Update: 2017-04-23 05:29 GMT
బాహుబలి2 మూవీలోని సాహోరే బాహుబలి పాటకు ఇప్పుడు ప్రోమో రిలీజ్ చేశారు. అదిరిపోయే గ్రాఫిక్స్.. అద్భుతమైన సీన్స్.. రక్తం మరిగించే ఎమోషన్స్.. అన్నీ రంగరించిన ఈ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే.. ఈ పాటలో ఓ స్పెషాలిటీ ఉంది.

సాహోరే బాహుబలి పాటలో రాజమౌళి కూతురు మయూఖ నటించింది. ప్రోమోలోనే ఆమెను చూపించారు కూడా. బాహుబలిపై పూలు విసురుతున్న ముగ్గురిలో ఎడం నుండి కుడికి చూసినట్లయితే..  వోణిలో ఉన్న మొదటి పిల్ల మయూఖ అయితే.. ఆమె పక్కన కాస్ట్యూమ్ డిజైనర్  ప్రశాంతి కూతురు అనన్య.. ఆ పక్కన కీరవాణి కూతురు కుముదవతి లు ఉన్నారు. అంతే కాదు.. అదే సీన్ లో ముందు వరుసలో ఇద్దరు బుడతలు పూలు విసురుతూ కనిపిస్తారు. వీళ్లిద్దరు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పిల్లలు.

బాహుబలి మొదటి భాగంలో రాజమౌళి ఒక సన్నివేశంలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్ కు ముందు కల్లు అమ్మే వ్యక్తిగా చిన్న పాత్రలో అప్పుడు జక్కన్న కనిపించగా.. ఇప్పుడు బాహుబలిపై పూలు చల్లే జస్ట్ చిన్న సీన్ లో తన కూతురితో నటింపచేశాడు ఎస్ ఎస్ రాజమౌళి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News