అభద్రతాభావంలో మెగా ఫ్యాన్స్...?

Update: 2020-08-28 23:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' పాత్రలో.. ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ మల్టీస్టారర్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చరణ్ కి ఈ సినిమాలో ఎంత ప్రాధానత్య ఉంటుందని.. ఎన్టీఆర్ తో సరి సమానంగా చెర్రీ పాత్ర ఉంటుందా లేదా అని మెగా ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.

కాగా రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా అప్పటికి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. చరణ్ కి 'రంగస్థలం' మూవీతో వచ్చిన క్రేజ్ మొత్తం 'వినయ విధేయ రామ' తీసేసిందని కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో రాజమౌళిని నమ్మి ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్.ఆర్.ఆర్'లో నటించడానికి సిద్ధపడ్డాడు చెర్రీ. అయితే ఈ సినిమా క్రెడిట్ మొత్తం రాజమౌళికి.. ఆ తర్వాత ఎన్టీఆర్ కి.. చివర్లో చెర్రీకి దక్కుతుందేమో అని మెగా టెన్షన్ పడుతున్నారట. పోనీ హిందీలో అయినా చరణ్ కి క్రెడిట్ వస్తుందనుకుంటే అక్కడ అజయ్ దేవగన్ ఉన్నాడు.

అంతేకాకుండా ఇదంతా చూసుకుంటే 'బాహుబ‌లి' సిరిస్ లో నటించిన దగ్గుబాటి రానా ఎలా మిగిలిపోయాడో చరణ్ కూడా అలా మిగిలిపోతాడేమో అనే అభద్రతాభావం మెగా ఫ్యాన్స్ లో ఎక్కువైందట. 'ఆర్.ఆర్.ఆర్'లో చరణ్ ఇంట్రో వీడియో చూసిన తర్వాత కాస్త నమ్మకం వచ్చినా సినిమా రిలీజయ్యాక చరణ్ కి ఈ సినిమా ఏ విధంగా ప్లస్ అవుతుందో అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. మెగా అభిమానుల ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే 'ఆర్.ఆర్.ఆర్' విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News