కాజల్‌ మళ్లీ వేట మొదలెట్టింది!

Update: 2015-07-03 04:03 GMT
కాస్త కాన్సంట్రేట్‌ చేయాలి కానీ అవకాశాల విషయంలో నాకు పోటీ మరెవ్వరూ రాలేరని చాటుతోంది కాజల్‌. నిన్న మొన్నటిదాకా తెలుగులో ఆమె ఊసే లేదు. కేవలం తమిళం, హిందీ సినిమాలపైనే కాన్సంట్రేట్‌ చేసినట్టు  కనిపించింది. దీంతో చాలామంది కథానాయికలు కాజల్‌ని పోటీగా భావించడం మానేశారు. కానీ ఊహించని విధంగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే  కాజల్‌ రెండు పెద్ద సినిమాల్ని పట్టేసి సాటి కథానాయికల గుండెల్లో దడ పుట్టించేసింది.   మహేష్‌బాబుతో 'బ్రహ్మూెత్సవం'లో ఓ కథానాయికగా నటించబోతోంది కాజల్‌. తాజాగా ఎన్టీఆర్‌-కొరటాల శివ సినిమాకి కూడా ఆమెనే ఎంపిక చేసేశారట. కాజల్‌ పెంచిన దూకుడుని చూసి కొత్త భామలంతా బెంబేలెత్తిపోతున్నారు. అవకాశం వస్తే గిస్తే మాకే రావాలి అనుకొన్న ఆ కథానాయికలంతా ఇప్పుడు మళ్లీ జాగ్రత్త పడుతున్నారు.

 ఎనిమిదేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతోంది కాజల్‌. చాలా మంది ఆమెని సీనియర్‌ కథానాయిక కిందే లెక్కగడుతున్నారు. కానీ కొత్తమ్మాయిలకి ధీటుగా తెరపై కనిపించే సత్తా తనకుందని కాజల్‌ తన సినిమాలతో ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంది. ప్రతీ సినిమాలోనూ కుర్రాళ్లని కిక్కెచ్చేస్తోంది. 'గోవిందుడు అందరివాడేలే' ఆమె అందం నిజంగానే మతిపోగొట్టింది. 'టెంపర్‌'లోనూ టెంపర్‌మెంట్‌ పుట్టించేసింది. అయితే మధ్యలో కథలు నచ్చకపోవడంతో ఆమె  తమిళ సినిమాలపై దృష్టిపెట్టింది. ఇంట్రెస్టింగ్‌ స్క్రిప్టులు వచ్చేయడంతో ఇప్పుడు మరోసారి తెలుగులో దుమ్ము దులిపేయాలని నిర్ణయించుకొంది.

Tags:    

Similar News