20 ఏళ్ల తర్వాత 'మన్మధుడి' మహేశ్వరి..!

త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాజేష్‌ దండా నిర్మిస్తున్న సందీప్ కిషన్ మూవీ లో కీలక పాత్రను చేసేందుకు అన్షు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Update: 2024-05-06 14:54 GMT

ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్స్‌ అడుగు పెడుతూ ఉంటారు. వారిలో అతి కొద్ది శాతం మంది మాత్రమే సక్సెస్ ని దక్కించుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. చాలా మంది ఫ్లాప్ అయ్యి కనుమరుగవుతారు. అయితే కొద్ది మంది మాత్రం సక్సెస్ వచ్చినా కూడా కొన్ని కారణాలతో కనుమరుగు అయ్యారు.

వారిలో మన్మధుడు లో మహేశ్వరి పాత్రలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ అన్షు. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత ప్రభాస్ కి జోడీగా రాఘవేంద్ర సినిమాలో నటించింది. ఆ సినిమాలోనూ నటిగా, అందంతో మెప్పించింది.

2004 లో జై అనే సినిమాలో నటించి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అన్షు కి ఆ తర్వాత కూడా చాలానే ఆఫర్లు వచ్చాయి. కానీ లండన్ వెళ్లి పోయి అక్కడ స్థిరపడింది. పెళ్లి, పిల్లలతో అక్కడే జీవితాన్ని గడిపింది. ఇప్పుడు అన్షు సినిమాల్లో రీ ఎంట్రీకి సిద్ధం అయ్యింది.

పిల్లలు పెద్ద వారు అవ్వడంతో పాటు, తనకు ఇండస్ట్రీ లో ఇంకా కూడా మంచి గుర్తింపు ఉండటం, వస్తే ఆదరిస్తారు అనే నమ్మకం ఉండటంతో అన్షు రీ ఎంట్రీతో అదరగొట్టేందుకు రెడీ అయ్యిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ కిషన్ సినిమాలో ఈమె కనిపించబోతుంది.

Read more!

త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాజేష్‌ దండా నిర్మిస్తున్న సందీప్ కిషన్ మూవీ లో కీలక పాత్రను చేసేందుకు అన్షు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు రీత్యా హీరో లేదా హీరోయిన్‌ లకు అమ్మ పాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి సందీప్ కిషన్ మూవీలో అన్షు ఏ పాత్ర లో కనిపించబోతుంది అనేది చూడాలి.

ఈ మధ్య కాలంలో సీనియర్‌ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చి కుమ్మేస్తున్నారు. వారిలో చాలా మంది కూడా సెకండ్‌ ఇన్నింగ్స్ లోనే ఎక్కువగా సంపాదిస్తున్నారు. కనుక అన్షు కూడా తనకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News