ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌ : చిరు - నాగ్ ల మల్టీ స్టారర్‌

Update: 2021-09-25 00:30 GMT
యంగ్‌ హీరోలు.. స్టార్‌ హీరోలు.. సీనియర్ హీరోలు ఎవరు మల్టీ స్టారర్ సినిమాలు చేసినా కూడా వాటికి విపరీతమైన క్రేజ్ ఉండటం ఖాయం. మల్టీ స్టారర్ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ సక్సెస్‌ అనే టాక్‌ ఉంటుంది. అందుకే మేకర్స్ ఎక్కువ బడ్జెట్‌ అయినా కూడా మల్టీ స్టారర్ సినిమా లను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఇండస్ట్రీలో కొందరు హీరోలు మాత్రం మల్టీ స్టారర్ సినిమాలకు ఆసక్తి చూపించరు. కథల విషయంలో ఒక హీరోకు ఎక్కువ ప్రాముఖ్యత ఒక హీరోకు తక్కువ ప్రాముఖ్యత ఉంటే అభిమానుల మద్య రచ్చ ఇతర గొడవలు ఉంటాయనే ఉద్దేశ్యంతో అసలు మల్టీ స్టారర్ సినిమాల జోలికి పోని వారు కొందరు ఉన్నారు. కాని ఇప్పుడు అభిమానుల విషయంలో కాస్త మార్పు వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే హీరోలు మల్టీ స్టారర్‌ సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇద్దరు సూపర్‌ స్టార్స్ అయిన ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లతో బిగ్గెస్ట్‌ మల్టీ స్టారర్ ను చేస్తున్న విషయం తెల్సిందే. ముందు ముందు మరిన్ని మల్టీ స్టారర్ లు వస్తాయంటున్నారు. ఇదే దారిలో చిరంజీవి మరియు నాగార్జునల మల్టీ స్టారర్ రాబోతున్నట్లుగా ఇంట్రెస్టింగ్‌ పుకార్లు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి.

తమిళంలో సూపర్‌ హిట్ అయిన విక్రమ్‌ వేదా సినిమాను తెలుగు లో రీమేక్ చేసేందుకు రెండు మూడు ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ లో మాధవన్ మరియు విజయ్ సేతుపతి కలిసి నటించారు. ఆ పాత్రలను తెలుగు లో వీరు వేయబోతున్నారు.. వారు వేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇంతలో కరోనా వల్ల మరింతగా ఆలస్యం అయ్యింది. సినిమా గురించిన పుకారు ఒకటి ప్రస్తుతం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇది ఖచ్చితంగా నిజం అయ్యి ఉండదు. కాని అభిమానులు సినీ అభిమానులు మాత్రం ఇది నిజం అవ్వాలని కోరుకుంటున్నారు. అదే ఈ రీమేక్ ను చిరంజీవి మరియు నాగార్జున కలిసి చేస్తున్నారు అనేది పుకారు. నిజం అయ్యేనో కాదో కాని ఖచ్చితంగా ఇది అభిమానుల అటెన్షన్‌ ను దక్కించుకునేలా ఉంది. ఒక వేళ ఇదే కనుక నిజం అయితే అద్బుతమే అంటూ సినీ అభిమానులు చెబుతున్నారు.

మూడు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ లో వీరు స్టార్‌ హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో మూవీ వచ్చే అవకాశం ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి. కాని ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్‌.. నాగార్జునల్లో ఏ ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేసినా చూడాలని అభిమానులు రెండు మూడు దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. కాని అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు విక్రమ్‌ వేద సినిమాను చేయాలని చిరంజీవి మరియు నాగార్జునలకు కోరిక కలగాలని.. ఇద్దరు కలిసి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ లు వీరిద్దరు ఎన్నో చేశారు. ఒక వేళ వీరు కలిసి చేస్తే మాత్రం ఖచ్చితంగా అది టాలీవుడ్‌ లో నిలిచి పోయే సినిమా అవుతుందని అంటున్నారు. వీరిద్దరి విక్రమ్‌ వేదా రీమేక్ అంటూ ఫ్యాన్ మేడ్‌ పోస్టర్ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ పుకారు నిజం అవ్వాలని.. ఇప్పటి వరకు వారికి ఈ ఆలోచన లేకుంటే వారికి ఇప్పటికి అయినా ఆ కోరిక కలిగేలా ఈ పుకార్లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క సినీ అభిమాని కోరుకునే ఈ కాంబో సెట్‌ అయ్యేనా అనేది చూడాలి.
Tags:    

Similar News