ఆ ఇద్ద‌రు సూప‌ర్ హీరోలు ఒకేసారి పాన్ ఇండియా!

ఇప్ప‌టికే మ‌హేష్ న్యూ హెయిర్ స్టైల్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది.

Update: 2024-04-29 23:30 GMT

2024 లో రెండు పెను సంచ‌ల‌నాలు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాయి. ఇద్ద‌రి జ‌ర్నీ ఒకేసారి పాన్ ఇండియాలో మొద‌ల‌వుతుంది. కానీ రిలీజ్ లు మాత్రం ఒకేసారి ఉండ‌వండోయ్. రెండు వేర్వేరుగా రిలీజ్ కానున్నాయి. ఇంత‌కీ ఎవ‌రా స్టార్లు అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రం రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఇప్ప‌టికే మ‌హేష్ న్యూ హెయిర్ స్టైల్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది.


లాంగ్ హెయిర్ లో రాకుమారుడిని త‌ల‌పిస్తున్నాడు. ఇలాంటి స్టైలిష్ లుక్ ట్రై చేయ‌డం మ‌హేష్ కెరీర్ లోనే ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్ ..జులై నుంచి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. రిలీజ్ ఎప్పుడు అన్న‌ది ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. రాజ‌మౌళి సినిమాలంటే రెండు మూడేళ్లు అయినా ప‌ట్టే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి రిలీజ్ అంచ‌నా వేయ‌డం కూడా సాధ్య‌మ‌య్యేది కాదు. ఇక మ‌రో హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` అనే పిరియాడిక్ చిత్రాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

Read more!

అన్ని అనుకున్న‌ట్లు గ‌నుక జ‌రిగితే ఇదే ఏడాది రిలీజ్ అవ్వాలి. ఇదే పీకే తొలి పాన్ ఇండియా సినిమా కావాలి. కానీ అది జ‌రిగే ప‌ని కాదు. అందుకే పీకే ప్ర‌త్యామ్నాయంగా సుజిత్ తో `ఓజీ` అనే చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. ఆ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కూ పూర్త‌యింది. ఎన్నిక‌ల బిజీ కార‌ణంగా బ్రేక్ ప‌డింది. లేదంటే ఇప్ప‌టికే రిలీజ్ అయ్యేది. దీంతో సెప్టెంబ‌ర్ లో ఎట్టి ప‌రిస్థితుల్లో రిలీజ్ మూవీగా చెబుతున్నారు. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ తో పీకే అభిమానుల్లో ఉంటోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రాని తెలుగుతో పాటు హిందీ ఇత‌ర భాష‌ల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంతో పీకే తొలి పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..మ‌హేష్ ఇద్ద‌రు ఒకేసారి పాన్ ఇండియా చిత్రాలు మొద‌లు పెట్ట‌డం విశేషం. ఇద్ద‌రు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్లు. కోట్లాది మంది అభిమానులున్నారు. అలాంటి స్టార్లు ఒకేసారి రావ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌దుల్లేవ్.

Tags:    

Similar News