విడుదల తేదీలను మార్చుకుంటున్న సినిమాలు

Update: 2020-03-20 23:30 GMT
కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా మల్టీ ఫ్లెక్సులు, థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. నిర్మాతల మండలి మార్చి 31 వరకు చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు నిలుపుదల చేసిన కారణంగా టాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న చిత్రాలు తమ షూటింగ్ లను నిలుపుదల చేసుకోగా, విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి. మొదట ఈ నెల ద్వితీయార్ధంలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ ఈ నెలాఖరున విడుదల చేయాలని భావించారు. కానీ తర్వాత కూడా కరోనా పరిస్థితులు మారేలా కనిపించక పోవడంతో మార్చి 25న రిలీజ్ కావాల్సిన చిత్రాలు ఏప్రిల్ నెలకు పోస్ట్ పోన్ అయ్యాయి. కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తన ప్రభావాన్ని తగ్గించుకునేలా కనబడక పోవడంతో ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న సినిమాలను కూడా తరువాతి వారాలకు వాయిదా వేయబోతున్నారు.

అనుష్క నటించిన 'నిశ్శబ్దం', మైత్రీ మూవీ మేకర్స్ వారి 'ఉప్పెన' చిత్రాలు ముందు ప్రకటించిన ప్రకారమైతే ఏప్రిల్ 2న విడుదల కావాల్సివుంది. వీటితో పాటు నాని - సుధీర్ బాబు నటించిన 'వి', రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' లాంటి సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాయి. నిర్మాతలు, ఎక్జిబ్యూటర్లు, పంపిణీదారులు ఈ నెలాఖరుకు అన్నీ సర్దుకుంటాయని మొదట భావించాయి, తాజా పరిస్థితులను బట్టి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో మన దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులలో గణనీయమైన క్షీణత వచ్చేవరకు ప్రచార కార్యక్రమాలు కూడా నిలిపి వేశారు. ఇదిలా ఉండగా కరోనా ఎఫెక్ట్ వల్ల టాలీవుడ్ కు కొన్ని వందల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News