మహిళ స్నానం చేస్తుండగా ఫోన్ లో వీడియో తీసి.. ఆ తర్వాత ఏంచేశారంటే !

Update: 2020-10-18 02:30 GMT
అసలు సమాజంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే , మనం జీవించేది ఇటువంటి సమాజంలోనా అని అనిపించకమానదు. సమాజాల్లో మహిళలపై రోజురోజుకి దాడులు, అత్యాచారాలు , బెదిరింపులు పెరిగిపోతున్నాయి. మహిళలకి మద్దతుగా ఎన్ని చట్టాలు , ఎంతమంది పోలీసులు , ఎన్ని సెక్షన్స్ ఉన్నా కూడా కామాంధుల భారిన పడకుండా ఆపలేకపోతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై పూర్తి వివరాల్లో వెళ్తే ..

పశ్చిమ గోదావరి జిల్లాలోని కామవరపుకోటలో కొందరు కామాంధులు రెచ్చిపోయారు. ఓ మహిళ స్నానం చేస్తుండగా ఆమెకి తెలియకుండా రహస్యంగా వీడియోలు , ఆ తర్వాత అవే వీడియోలని చూపించి తమ కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశారు. ఆ వేధింపులు తట్టుకోలేని బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన పై పూర్తి వివరాల్లో వెళ్తే ..

కామవరపుకోట మండలంలోని వీరంపాలెం గ్రామానికి చెందిన ఓ వివాహిత బాత్రూమ్ ‌లో స్నానం చేస్తుండగా కొందరు యువకులు రహస్యంగా సెల్‌ ఫోన్‌ లో వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఉన్నాయి అన్న దైర్యంతో ,డైరెక్ట్ గా ఆ మహిళ ఇంటికే వెళ్లి రహస్యంగా తీసిన వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టారు. కీచకుల వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు తడికలపూడి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తడికలపూడికి చెందిన శ్రీను, రాజాతో పాటు సమీపంలోని వేగివాడ గ్రామానికి చెందిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News