త్వరలో వైరలెస్​ చార్జింగ్​ .. షావోమి ప్రయోగాలు..

Update: 2021-01-31 00:30 GMT
మొబైల్​ దిగ్గజ కంపెనీ షావోమి నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఎయిర్​ చార్జింగ్​ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతున్నది. ప్రస్తుతం ఇది ఇంకా ప్రయోగదశల్లోనే ఉంది. ప్రస్తుతం ఫోన్​ చార్జింగ్​ పెట్టాలంటే కనీసం అరగంట.. 45 నిమిషాలు పడుతుంది.  ఈ నేపథ్యంలో మరింత వేగంగా చార్జింగ్​ చేసుకొనేందుకు షావోమీ ఈ కొత్త టెక్నాలజీని తీసుకురాబోతున్నది. ప్రస్తుతం కొన్ని మొబైల్​ కంపెనీలు ఫాస్ట్​చార్జింగ్​, వైరలెస్​ చార్జింగ్​ను తీసుకొచ్చాయి. అయితే షావోమి మాత్రం మరో కొత్త టెక్నాలజీని తొలిసారి అందుబాటులోకి రానున్నారు.

ప్రస్తుతం చార్జింగ్​ పెట్టాలంటే కచ్చితంగా కేబుల్​, అడాప్టర్​ ఉండాల్సిందే. అయితే షావోమి ప్రవేశపెట్టబోయే కొత్త టెక్నాలజితో వైర్​లెస్​ చార్జింగ్​ను తీసుకురాబోతున్నది.
నాలుగు సెంటీమీటర్ల పరిధి వరకు వైర్​లెస్​ సరఫరా చేయనున్నది.ఈ కొత్త టెక్నాలజీ సాయంతో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్​లను చార్జ్​ చేసుకోవచ్చు. ఎయిర్​ చార్జర్​లో దిమ్మె లాంటి వస్తువు ఉంటుంది. అందులో ఐదు యాంటినాలు ఉంటాయి. అవి పవర్​ని తరంగాల ద్వారా స్మార్ట్​ఫోన్​కు అందజేస్తాయి.

అయితే ప్రస్తుతం ఈ విధానం ఇంకా ప్రయోగదశల్లోనే ఉంది. ఈ తరహా చార్జింగ్​ ద్వారా ఆరోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయోగాలు పూర్తయ్యాకే ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని షావోమి ప్రకటించింది.ఎయిర్​ చార్జింగ్​ టెక్నాలజీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని  షావోమి వినియోగదారులు కూడా ఆసక్తి చూపుతున్నారు.
Tags:    

Similar News