చింతమనేని..వనజాక్షి ఫ్రెండ్సయిపోయారు

Update: 2017-04-27 08:14 GMT
వనజాక్షి.... ఈ పేరు గుర్తుండే ఉంటుంది.  ఎమ్మార్వో వనజాక్షి అంటే ఇంకా ఠక్కున గుర్తుకొచ్చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో జరిగిన గొడవ.. ఆ వ్యవహారం రాష్రమంతటా చర్చనీయం కావడం తెలిసే ఉంటుంది.  ఇసుక రవాణా విషయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని - ఎమ్మార్వో వనజాక్షిల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది.  ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. అయితే, తాజాగా వారిద్దరూ మంచి ఫ్రెండ్సయిపోయారట. రీసెంటుగా ఓ కార్యక్రమంలో వారిని చూసిన అధికారులు - నాయకులు కూడా షాకైపోయారట.
    
పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు బాల సదనం హాస్టల్ లో మేఘన అనే ఓ బాలికను ఈరోజు వనజాక్షి దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి చింతమనేని కూడా హాజరయ్యారు. ముందుగా వనజాక్షికి ఆయన స్వాగతం పలికారు. చింతమనేనికి వనజాక్షే స్వయంగా బొకే ఇచ్చారు.
    
ఇంకో విషయం ఏంటంటే...  విధి నిర్వహణలో భాగంగానే అప్పటి గొడవ జరిగిందని... ఆ గొడవను తాము మర్చిపోయామని వనజాక్షి చెబుతున్నారు. తామిద్దరం దాయాదులం కాదని, శత్రువులం అంతకన్నా కాదని ఆమె అంటున్నారు. నేతలతో గొడవపడి లాభం లేదనుకున్నారో ఏమో కానీ వనజాక్షే రాజీకొచ్చారని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News