మహిళా ఎంపీలా మజాకా.. వీడియో వైరల్

Update: 2019-09-21 11:00 GMT
పశ్చిమ బెంగాల్ లో దసరా వేడుకలు దేశంలోనే అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ దుర్గామాతను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కూడా ఇక్కడి దుర్గామాతాను దర్శించుకొని పూజలుచేశారు. ఇప్పుడు దసరా కావడంతో బెంగాల్ లో ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అంతటా కోలాహలం సందడి నెలకొంది.

తాజాగా ఈ దసరా ఉత్సవాల్లో మన పార్లమెంట్ ఎంపీలు దుమ్ములేపారు. తృణమూల్ యువ మహిళా ఎంపీలైన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తిలు దసరా ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ దుస్తుల్లో దుర్గమ్మను ఆరాదిస్తూ భక్తి గీతానికి చేసిన డ్యాన్స్ ఉర్రూతలూగించింది. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాతో దుమ్మురేపుతోంది.

బెంగాల్ సినిమా ఇండస్ట్ర్రీలో  సుస్రత్, మిమిలు   ఫేమస్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో వీరిద్దరి పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నుస్రత్ కు బసిర్ హట్, మిమి చక్రవర్తికి జాదవ్ పూర్ ఎంపీ టికెట్ ఇచ్చి తృణమూల్ తరుఫున ఎంపీలుగా నిలబెట్టారు. వారిద్దరూ ఎంపీలుగా గెలిచి పార్లమెంట్ గడపతొక్కారు. యువ అందమైన మహిళా ఎంపీలుగా  ఈ లోక్ సభలో పేరుపొందారు. తాజాగా దసరా ఉత్సవాల్లో ఇద్దరూ కలిసి చేసిన వీడియో వైరల్ గా మారింది.


Full View


Tags:    

Similar News