మతిస్థిమితం లేక పోలీసుల మీద అలా ఆరోపణలు చేశారట

Update: 2019-12-18 07:27 GMT
వైరల్ వీడియోతో చెలరేగిపోయి.. పోలీసులకు చెమటలు పట్టించిన హైదరాబాద్ కు చెందిన దంపతులు ఇప్పుడు ప్లేట్ మార్చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లోని పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేసి సంచలనంగా మారిన వారు.. రోజు వ్యవధిలో తమ మాటను మార్చేశారు. అదెలా అంటే.. మతిస్థిమితం సరిగా లేకపోవటం కారణంగా తాము నోటికి వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా చెప్పి షాకిస్తున్నారు.

సోమవారం సాయంత్రం వేళలో.. అట్లూరి సురేశ్ దంపతులు బంజారాహిల్స్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్ కు వెళితే.. తన పట్ల అనుచితంగా ప్రవర్తించటమే కాదు.. నిర్బందించి లైంగికంగా వేధించినట్లుగా ఒక వీడియోను విడుదల చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోని ఎస్ ఐలు.. కానిస్టేబుళ్లు తమపై అనుచితంగా వ్యవహరించినట్లుగా పేర్కొన్నారు.

ఈ వైరల్ వీడియోపై డీసీపీ స్పందించి.. ప్రెస్ మీట్ పెట్టటం.. ఈ దంపతులపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్న విషయం బయటకు వచ్చింది. అనంతరం పరిణామాలువేగంగా మారాయి. తాజాగా.. ఈ దంపతులు మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీని ప్రకారం తమకు మతిస్థిమితం సరిగా లేని కారణంగా తాము బంజారాహిల్స్ పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేశామని.. మీడియా విలువైన సమాయాన్ని వెస్ట్ చేశామని.. తమను క్షమించాలని కోరటం గమనార్హం. బంజారాహిల్స్ పోలీసులపై తాము అనాలోచితంగా చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వారు పేర్కొనటం గమనార్హం.
Tags:    

Similar News